Asianet News TeluguAsianet News Telugu

Rakul Preeth Singh:ముంబైలో ప్రియుడితో రకుల్ చెట్టాపట్టాల్... నైట్ పార్టీలు ఎంజాయ్ చేస్తున్న అమ్మడు!


ముంబై కి మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh)ప్రియుడుతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట, తరచుగా కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఈ లవ్ బర్డ్స్ వినోద, విహారాలు బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

rakul preeth enjoys dinner party with boy friend jackky bhagnani
Author
Hyderabad, First Published Jan 27, 2022, 3:44 PM IST


ముంబై కి మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh)ప్రియుడుతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట, తరచుగా కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఈ లవ్ బర్డ్స్ వినోద, విహారాలు బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. అక్కడ ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో నివాసం అక్కడికి మార్చేశారు. తన గత పుట్టిన తేదీ నాడు రకుల్ బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. జాకీతో రకుల్ కి పరిచయం ఉన్నట్లు మీడియాకు కూడా తెలియదు. అలాంటిది ఆమె సడన్ గా జాకీ నా లవర్ అనడంతో అందరూ షాక్ అయ్యారు. 

ఏది ఏమైనా రకుల్ ఓ ఇంటి కోడలు కాబోతుందని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. మరి పెళ్లి ఎప్పుడు అంటే దానికి ఇంకా చాలా సమయం ఉందంటుంది. ఈ సినిమా వాళ్ళ ప్రేమలు అంత బలంగా ఉండవు. ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. దీనితో రకుల్-జాకీ బంధం పెళ్లి వరకు వెళుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సంగతి ఎలా ఉన్నా ప్రేమను మాత్రం ఈ జంట ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇటీవల రకుల్-జాకీ డిన్నర్ నైట్ పార్టీకి అటెండ్ అయ్యారు. జంటగా నైట్ విహరిస్తున్న రకుల్-జాకీలను మీడియా వాళ్ళు తమ కెమెరాల్లో బంధించారు. కాగా రకుల్ పూర్తిగా టాలీవుడ్ ని వదిలేశారు. ఆమె బాలీవుడ్ మాత్రమే సినిమాలు చేస్తున్నారు. రకుల్ ఇటీవల నటించిన తెలుగు చిత్రాలు చెక్, కొండపొలం ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో హిందీలో చేతి నిండా ఆఫర్స్ ఉన్నాయి. రకుల్ ఇక్కడ ఫేడ్ అవుట్ అయినా అక్కడ జోరు చూపిస్తున్నారు. 

బాలీవుడ్ ప్రేక్షకుల కోసం జీరో సైజ్ మైంటైన్ చేస్తుంది. ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే రకుల్ కఠిన కసరత్తులు చేస్తారు. వ్యాయాయం తన దినచర్య లో భాగంగా ఉంటుంది. అలాంటి రకుల్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం అనూహ్యం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. రకుల్ ఎన్సీబీ అధికారులు విచారించడం జరిగింది. టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ ఆరోపణలు తెరపైకి రాగా రకుల్ పేరు కూడా వినిపించింది. ఈడీ అధికారుల విచారణలో రకుల్ పాల్గొన్నారు. 

ఇప్పుడు తెలుగులో ఫేడ్ అవుట్ అయినప్పటికీ రకుల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. మహేష్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ కి జంటగా నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios