స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ యంగ్‌ హీరోతో రొమాన్స్ కి సిద్ధమవుతుంది. `పాగల్‌` హీరో విశ్వక్‌ సేన్‌తో జోడి కడుతుంది. అయితే ఓటీటీ సినిమా కోసం రకుల్‌.. విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించడం విశేషం. 

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ యంగ్‌ హీరోతో రొమాన్స్ కి సిద్ధమవుతుంది. `పాగల్‌` హీరో విశ్వక్‌ సేన్‌తో జోడి కడుతుంది. అయితే ఓటీటీ సినిమా కోసం రకుల్‌.. విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించడం విశేషం. ఇప్పటికే సమంత, కాజల్‌, తమన్నా, రాశీఖన్నా వంటి హీరోయిన్లు ఓటీటీలో నటిస్తున్నారు. ఇప్పుడు రకుల్‌ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతుంది. 

విశ్వక్‌ సేన్‌ నటించిన `పాగల్‌` విడుదలకు సిద్ధంగా ఉంది. అనంతరం మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇటీవల అది పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ ఓటీటీలో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. పాంథాలజీ నేపథ్యంలో హలోవీన్‌ డే నైట్‌ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ గా సాగే ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు తమిళంలో బైలింగ్వల్‌గా రూపొందిస్తున్నారు. 

దీనికి `అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌` అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ఇందులో నివేతా పేతురాజ్‌, మంజిమా మోహన్‌, మేఘా ఆకాష్‌, రేబా మోనికా జాన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇందులో విశ్వక్‌సేన్‌ ది గెస్ట్ రోల్‌ అని టాక్. కానీ అతని పాత్ర హైలైట్‌గా, ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందట. ఇందులో విశ్వక్‌ సరసన రకుల్‌ని సంప్రదించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. రకుల్‌ పాత్రకి కూడా ప్రయారిటీ ఉంటుందట. 

రకుల్‌ చివరగా `చెక్‌` చిత్రంలో నటించింది. ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ సరసన `జంగిల్‌బుక్‌` సినిమాలో నటిస్తుంది. హిందీలో `మేడే`, `ఎటాక్‌`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమా చేయబోతుంది.