గెస్ట్ రోల్లో రజనీకాంత్.. పదకొండేళ్ల తర్వాత మరోసారి ?
రజనీకాంత్ చాలా కాలం తర్వాత గెస్ట్ గా మెరవబోతున్నారట. లేటెస్ట్ గా ఈ వార్త కోలీవుడ్ లో వైరల్ అవుతుంది. మరి ఏ సినిమాలో నటిస్తున్నారనేది తెలుసుకుంటే..
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు `జైలర్` చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆయన త్వరలో ఓ చిత్రంలో గెస్ట్ గా మెరవబోతున్నారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ వార్త ఇప్పుడు అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా ఓ సినిమాని రూపొందిస్తుంది. అధర్వ మురళీ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇందులో అతిథి పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నట్టు కోలీవుడ్ టాక్. తన తండ్రిని గెస్ట్ గా నటింపచేయాలని ఐశ్వర్య ప్లాన్ చేశారట. అందుకోసం ప్రత్యేకంగా ఓ పాత్రని డిజైన్ చేసినట్టు సమాచారం. గెస్ట్ రోల్ గురించి రజనీతో ఐశ్వర్య చెప్పగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ `లైక ప్రొడక్షన్ నిర్మిస్తుంది. రజనీకాంత్ చివరగా బాలీవుడ్లో షారూఖ్ హీరోగా నటించిన `రా వన్`లో గెస్ట్ గా నటించారు. ఇందులో ఆయన చిట్టి రోబో పాత్రలో మెరిశారు.
ఇక రజనీకాంత్ చివరగా `పెద్దన్న` చిత్రంతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు `బీస్ట్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్` చిత్రం చేస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తున్న సమాచారం.