అద్భుతమైన దర్శకుడిని కోల్పోయాంః కె.వి ఆనంద్కి రజనీ, మహేష్, ధనుష్ సంతాపం
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి ఆనంద్ కి సూపర్స్టార్ట్స్ రజనీకాంత్, మహేష్బాబు, ధనుష్ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు.
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి ఆనంద్ కి సూపర్స్టార్ట్స్ రజనీకాంత్, మహేష్బాబు, ధనుష్ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి ఆనంద్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురయ్యింది. అద్భుతమైన, విలక్షణమైన సినిమాలను అందించిన దర్శకుడు ఇక లేరనే వార్తతో విచారం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ స్పందిస్తూ, `గౌరవనీయమైన కె. వి ఆనంద్ మరణం దిగ్ర్భాంతికరమైనది. చాలా బాధాకరమైనది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని తమిళంలో ట్వీట్ చేశారు.
మహేష్బాబు స్పందిస్తూ, `కె.వి ఆనంద్ మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. చిత్ర దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా ఆయన ప్రతిభ అద్భుతం. వారి కుటుంబానికి,ప్రియమైన వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నా` అని ట్వీట్ చేశారు.
`సున్నితమైన దయగల నిజాయితీ గల వ్యక్తి కన్నుమూశారు. జీవిత ప్రేమ, ఆనందంతో నిండిన చాలా మధురమైన మనిషి. కె.వి ఆనంద్ సర్ చాలా త్వరగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు సర్. ఆయన కుటుంబానికి నా సానుభూతి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని పేర్కొన్నారు హీరో ధనుష్.