‘జైలర్’ చిత్రానికి రజినీ భారీ రెమ్యూనరేషన్.. సౌత్ లోనే హయ్యేస్ట్ అంటూ టాక్.!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాలోయింగ్.. మార్కెటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడు పదుల వయస్సులోనూ అదిరిపోయే యాక్షన్ మూవీస్ లో నటిస్తున్నారు. అయితే తన రాబోయే చిత్రానికి రజినీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలియని సినీప్రేక్షకుడు ఉండడేమో. పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా.. జపాన్ లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉన్నసూపర్ స్టార్ రజనీ కాంత్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందిచిన తలైవా ఇప్పటికీ అదిరిపోయే యాక్షన్ ఫిల్మ్స్ లో నటిస్తున్నారు. ఏడు పదుల వయస్సులోనూ సినిమా తర్వాత సినిమాను ప్రకటిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇటీవల తన తదుపరి చిత్రం‘జైలర్’ (Jailer)ను ప్రకటించిన విషయం తెలిసిందే. మూవీని దర్శకుడు నెల్సన్ దీలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే రావడంతో సినీ ఇండస్ట్రీలో కొన్ని పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు రూ. కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రేంజ్ లో సౌత్ హీరోల మార్కెట్ ఎక్స్ ప్యాండ్ అయ్యింది. దీంతో రెమ్యూనరేషన్ ను ఒక్కసారిగా పెంచేశారు. ఇప్పటికే బహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రూ.80 నుంచి రూ.100కు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇదే దారిలో మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజిత్, విజయ్, మోహన్ లాల్ నడుస్తున్నారు. కాగా రజినీ కాంత్ మాత్రం వీరందరినీ మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
రజినీ చిత్రాలకు మార్కెట్ అంచనాలకు మించి ఉంది. పలు నివేదికల ప్రకారం, రజనీకాంత్ ప్రస్తుతం తన రెమ్యునరేషన్గా రూ. 100 కోట్లను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఫిల్మ్ బిజినెస్ అఫీషియల్లో లాభాలతో సహా సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఇప్పటికే రజినీ పేరొందాడు. అయితే తాజాగా తన 169వ చిత్రం ‘జైలర్’కు ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే సౌత్ లోనే రజినీ హ్యయేస్ట్ పేయిడ్ ఆర్టిస్ట్ గా రికార్డ్ క్రియేట్ చేసినట్టేనని అంటున్నారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar), రజినీకాంత్ కాంబినేషన్ లో గతంలోనే సినిమాను ప్రకటించిన మేకర్స్ తాజాగా టైటిల్ ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ జైలర్ గా కనిపిస్తాడట. కథ అంతా జైల్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ప్రత్యేకంగా వేసిన జైల్ సెట్ లోనే దాదాపు షూటింగు జరుగుతుందని సమాచారం. సినిమాలో ఐశ్వర్యరాయ్, రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ కనువిందు చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.