మోడీ, మాల్యాలను టార్గెట్ చేసిన రాజేంద్రప్రసాద్..`క్లైమాక్స్` ట్రోల్స్ కి కారణమదేనా ?
రాజేంద్రప్రసాద్.. ప్రధాని మోడీ, బ్యాంక్లకి కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాని, నిరవ్ మోడీలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. మొత్తానికి వారిని ఓ రేంజ్లో ఆడుకోబోతున్నట్టే కనిపిస్తున్నాడు. మరి రాజేంద్రప్రసాద్ ఇంతకి ఏం చేయబోతున్నాడంటే.
రాజేంద్రప్రసాద్.. ప్రధాని మోడీ, బ్యాంక్లకి కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాని, నిరవ్ మోడీలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. మొత్తానికి వారిని ఓ రేంజ్లో ఆడుకోబోతున్నట్టే కనిపిస్తున్నాడు. మరి రాజేంద్రప్రసాద్ ఇంతకి ఏం చేయబోతున్నాడంటే. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో `క్లైమాక్స్ ` అనే చిత్రం రూపొందింది. భవానీ శంకర్ దర్శకత్వం వహించారు. సాషా సింగ్, శ్రీరెడ్డి వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు భవానీ శంకర్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
మోడీలు, విజయ్ మాల్యాలపై సెటైరికల్గా సినిమా సాగుతుందట. విజయ్ మాల్యా లైఫ్ స్టయిల్ని రాజేంద్రప్రసాద్ లైఫ్ స్టయిల్ ప్రతిబింబిస్తుందట. బిలియనీర్ లగ్జరీలను చెప్పబోతున్నట్టు తెలిపారు. విజయ్ మాల్యా వంటి వారిని గుర్తు తేవాలని ఆ పాత్రని డిజైన్ చేసినట్టు చెప్పారు. అంతేకాదు రాజకీయాలపై సెటైర్లు కూడా ఉంటాయన్నారు. ప్రధాని మోడీని టార్గెట్ చేయలేదని, ఐపీఎస్ స్కామ్ చేసిన లలిత్ మోడీ, కోట్లు ఎగొట్టిన నీరవ్ మోడీలను గుర్తు చేస్తుందన్నారు. కానీ ట్రైలర్ విడుదలయ్యాక, మోడీలు, మాల్యాలు అనే డైలాగు ప్రధాని మోడీని టార్గెట్ చేశారని చాలా మంది ట్రోల్ చేసినట్టు దర్శకుడు చెప్పాడు.
ఓ బిలియనీర్ హత్యకు గురైతే ఆ తర్వాత ఏం జరిగింది, మర్డర్ మిస్టరీగా సినిమా సాగుతుందని, అయితే రెగ్యూలర్గా కాకుండా కొత్తగా ప్రయత్నించామని చెప్పాడు. ఇందులో రాజేంద్రప్రసాద్ పేరు మోడీ అని, ఆయనకు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో క్లైమాక్స్ లోనే తెలుస్తుందన్నారు. రాజేంద్రప్రసాద్ మాత్రమే ఈ కథకి సూట్ అవుతారని, మోహన్బాబుని కూడా అనుకున్నామన్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్ వివాదాస్పద నటిని పెట్టి సినిమా తీయాలనుకుంటారని, అందుకోసం శ్రీరెడ్డిని ఎంచుకున్నట్టు చెప్పారు. వీరి సన్నివేశాలు హైలైట్ అవుతాయని చెప్పారు. మొత్తంగా `క్లైమాక్స్` ఓ ప్రయోగమని చెప్పారు.