Asianet News TeluguAsianet News Telugu

కల్కి స్టోరీ లైన్.. మర్డర్స్ చుట్టూనే..

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌. ఆ మధ్య వచ్చిన వరస ప్లాప్ లతో   చేయబోయే ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తున్నారు. 

Rajasekhar - Prasanth Varma Kalki story
Author
Hyderabad, First Published Apr 12, 2019, 7:19 PM IST

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌. ఆ మధ్య వచ్చిన వరస ప్లాప్ లతో   చేయబోయే ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఒక్క టీజర్ తోనే సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశారు మేకర్స్‌. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటన్నది సినీ లవర్స్ లో చర్చనీయాంశంగా మారింది. 

సిని వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కథ మొత్తం 1985 లో జరుగుతుంది.  కృష్ణా జిల్లాలో మూడు ధనవంతులైన కుటుంబాలను చంపేందుకు ప్రత్యర్దులు తాగే నీటిలో విషం కలుపుతారు. అదే సమయంలో గుంటూరు జిల్లాలో వరసగా మిస్టీరియస్ గా మర్డర్స్ జరుగుతూంటాయి. ఈ రెండింటికి లింక్ ఉంటుంది. ఈ కేసుని విచారించటానికి వచ్చిన ఇన్వేస్టిగేటివ్ ఆఫీసర్ రాజశేఖర్. క్లైమాక్స్ లో ఓ రేంజిలో పేలే ట్విస్ట్ ఉంటుంది. అది కల్కికు లింక్  అయ్యి ఉంటుంది. ఇదే స్టోరీ లైన్ అంటున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.  దశావతారాల్లో ‘కల్కి’ 10వ అవతారం కావడం వల్లనే ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొనడం విశేషం. రాజశేఖర్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.  ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios