Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్‌ రాముడిగా.. ముందే తెలుసంటున్న జక్కన్న

తాజాగా `ఆదిపురుష్‌` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. 

rajamouli said that prabhas already knew about adipurush
Author
Hyderabad, First Published Aug 25, 2020, 4:19 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మూడూ పాన్‌ ఇండియా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న చిత్రాలివి. అందులో `రాధేశ్యామ్‌` ప్రస్తుతం తెరకెక్కుతుండగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్‌ చేయబోతున్నాడు. దీంతోపాటు అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తూ గత వారం `ఆదిపురుష్‌` పేరుతో ఓ పౌరాణిక ప్రాజెక్ట్ ని ప్రభాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిపై ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, రాముడిగా ప్రభాస్‌ కనిపించనున్నారు.

తాజాగా `ఆదిపురుష్‌` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. ఆయన చెబుతూ, `ఆదిపురుష్‌` చిత్ర పోస్టర్‌ని అందరి కంటే ముందే చూశా. అద్భుతంగా ఉంది. రాముడి పాత్రకి ప్రభాస్‌ పర్‌ఫెక్ట్ యాప్ట్, ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం  నిర్మాణం  జరుగుతుంది. ఈ సమయంలో రాముడిపై సినిమా తీయడం అభినందనీయం` అని చెప్పారు.

`దేశం మొత్తం రాముడి గురించి చర్చ జరుగుతుండగా, ఆయనపై సినిమా వస్తే దానికి మరింత క్రేజ్‌ వస్తుంది. అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ప్రభాస్‌ స్థాయిని పెంచుతుంది. సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం ఉండబోతుంద`ని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆయన `ఆర్‌ ఆర్‌ ఆర్‌` పేరుతో పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతుంది. ఇది కూడా గ్రాండియర్‌గా రూపుదిద్దుకుంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios