Asianet News TeluguAsianet News Telugu

కన్నుల పండుగలా ఎన్టీఆర్ 30 లాంచ్.. హాజరైన రాజమౌళి, ప్రశాంత్ నీల్, జాన్వీ కపూర్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రం కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. 

Rajamouli Prashanth Neel Janhvi Kapoor and other celebrities at NTR30 launch dtr
Author
First Published Mar 23, 2023, 9:35 AM IST

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రం కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. కనుల పండుగలా జరిగిన ప్రారంభోత్సవానికి అతిరథమహారథులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, యువ సుధ ఆర్ట్స్ సుధాకర్ కలసి నిర్మిస్తున్నారు. 

Rajamouli Prashanth Neel Janhvi Kapoor and other celebrities at NTR30 launch dtr

ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైట్ షర్ట్ ధరించి, హ్యాట్ పెట్టుకుని స్టైలిష్ గా మెరిశారు. కొరటాల శివ, కళ్యాణ్ రామ్ ఇతర చిత్ర యూనిట్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఆమెకి ఇదే తొలి చిత్రం. 

Rajamouli Prashanth Neel Janhvi Kapoor and other celebrities at NTR30 launch dtr

జాన్వీ కపూర్ ఈ కార్యక్రమంలో గ్రీన్ శారీ ధరించి అందంగా కనిపించింది. ఎన్టీఆర్ రాగానే ఆమె చేతులో చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడారు. జాన్వీ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఎన్టీఆర్ తో ముచ్చటించింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Rajamouli Prashanth Neel Janhvi Kapoor and other celebrities at NTR30 launch dtr

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇక చిత్ర పరిశ్రమ నుంచి దిల్ రాజు, ప్రకాష్ రాజ్, హీరో శ్రీకాంత్ ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Rajamouli Prashanth Neel Janhvi Kapoor and other celebrities at NTR30 launch dtr

కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలో ఇక షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉంటూనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే హైఓల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రత్నవేలు డీఓపీగా పనిచేయనున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios