Asianet News TeluguAsianet News Telugu

మరోసారి జతకట్టిన జక్కన్న, ఎన్టీఆర్..

  • వారు సినిమా కోసం కాదు జత కట్టింది. ఓ మంచి ప్రయత్నం కోసం.
  • ఈ షార్ట్ ఫిల్మ్ కి వాయిస్ అందించేందుకు రాజమౌళి, ఎన్టీఆర్ ముందుకు వచ్చారు.
  • అందుకే వీటి ద్వారా ప్రజల్లోకి చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
rajamouli and NTR comes with short films

 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మరోసారి జతకడుతున్నారు. వీరిద్దరి కాంభినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ వంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ఈ సారి ఏ బ్లాక్ బస్టర్ తో వసారో అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పొరపాటుపడినట్టే. ఎందుకంటే.. వారు సినిమా కోసం కాదు జత కట్టింది. ఓ మంచి ప్రయత్నం కోసం.

రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ క్రైంని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఓ షార్ట్ ఫిల్మ్ ని రూపొందిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి వాయిస్ అందించేందుకు రాజమౌళి, ఎన్టీఆర్ ముందుకు వచ్చారు. వేరు వేరుగా రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కి వీరు డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించారు.

ప్రస్తుతం తారక్.. ‘ జై లవ కుశ’ చిత్రం, బిగ్ బాస్ షోలతో బిజిబిజీగా గడపుడుతున్నాడు. అయినప్పటికీ.. ఈ షార్ట్ ఫిల్మ్ కి వాయిస్ ఓవర్ చెప్పేశాడట. రాజమౌళి మాత్రం దానికి సంబంధించి కొన్ని మార్పులు.. చేర్పులు చెప్పాడట. అవి పూర్తైతే.. రాజమౌళి కూడా వాయిస్ ఇచ్చేస్తాడు.

ఎడిటింగ్ పూర్తైన తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్స్ ని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, మల్టీ ఫ్లెక్సులు, పలు రద్దీ ప్రాంతాల్లో ప్రదర్శించాలని సైబరాబాద్ పోలీసులు యోచిస్తున్నారట.

సరైన అవగాహన లోపంతో చాలా మంది సైబర్ దాడులకు గురయ్యి.. నగదు కోల్పోతున్నారు. అందుకే వీటి ద్వారా ప్రజల్లోకి చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

Follow Us:
Download App:
  • android
  • ios