హిందీ సూపర్ హిట్ రీమేక్ లో రాజ్ తరణ్,డైరక్టర్ మాత్రం
వరస ప్లాఫ్ ల్లో ఉన్నా సినిమా లు చేయటంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు రాజ్ తరుణ్. గత ఏడాది అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజైంది. సినిమా గొప్పగా లేదని టాక్ వచ్చింది. రివ్యూలు ఫ్లాఫ్ అన్నాయి. అయితే రాజ్ తరణ్ ఆ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండాతోనే ‘పవర్ ప్లే’ అనే సినిమా చేసాడు. నిన్న శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫలితం తేడాగానే ఉంది. అయినా మళ్లీ అదే దర్శకుడుతో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ సారి ఓ రీమేక్ ని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు.
వరస ప్లాఫ్ ల్లో ఉన్నా సినిమా లు చేయటంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు రాజ్ తరుణ్. గత ఏడాది అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజైంది. సినిమా గొప్పగా లేదని టాక్ వచ్చింది. రివ్యూలు ఫ్లాఫ్ అన్నాయి. అయితే రాజ్ తరణ్ ఆ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండాతోనే ‘పవర్ ప్లే’ అనే సినిమా చేసాడు. నిన్న శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫలితం తేడాగానే ఉంది. అయినా మళ్లీ అదే దర్శకుడుతో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ సారి ఓ రీమేక్ ని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే...ఆయుష్మాన్ మరో హిట్ చిత్రం డ్రీమ్ గర్ల్ను తెలుగులో రీమేక్ చేసేందుకు అంతా సిద్దమైంది. ప్రముఖ నిర్మాత సురేశ్బాబు డ్రీమ్ గర్ల్ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు. రాజ్ తరుణ్ ఈ రీమేక్లో నటించబోతున్నాడు. ఇటీవలే పవర్ ప్లే ప్రమోషన్ ఈవెంట్లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..ఓరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ డ్రీమ్ దర్శకత్వంలో రూపొందే గర్ల్ తెలుగు రీమేక్లో జాయిన్ అవుతున్నట్టు చెప్పాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, మిగిలిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం బాలీవుడ్లో ప్రమోగాత్మక చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘అంధాథూన్’, ‘బదాయి హో’ వంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత హీరోలలో డిఫరెంట్ సినిమాలు చేసే స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత ఆయుష్మాన్ పేరే వినపడుతోంది. ఈ హీరో డిఫరెంట్ రోల్లో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లను వసూలు చేసింది. ఇంత భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంలో నటిస్తూండటంతో రాజ్ తరుణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రీమేక్ చిత్రం సైతం కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే ఆయుష్మాన్ ఖురానా కరమ్గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇందులో కరమ్ స్థానికంగా జరిగే చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు చేస్తుంటాడు. దీంతో అమ్మాయి గొంతుతో ఫేమస్ అయిన కరమ్కు ఫ్రెండ్షిప్ అనే కాల్ సెంటర్లో జాబ్ వస్తుంది. కరమ్ పేరు కాస్త పూజాగా మార్చుకుంటాడు. లోన్లీగా ఫీలయి కాల్ సెంటర్కు ఫోనే చేసే అమ్మాయి, అబ్యాలతో గొంతు మార్చి సరదాగా మాట్లాడుతూ వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతాడు. ఆ క్రమంలో వచ్చే సమస్యల సమాహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలో నుస్రత్ భరూచా హీరోయిన్ గా నటించగా.. అన్నుకపూర్ కీ రోల్ పోషించారు. మరి తెలుగు వెర్షన్ లో రాజ్తరుణ్ ఎలా ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.