హీరో గారి అరటిపళ్ల టాపిక్ వైరల్!
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయం హైలెట్ అవుతోంది. ఏదైనా టాపిక్ మొదలైతే దాని అంతు చూడందే వదలం అన్నట్లుగా జనం రెస్పాండ్ అవుతున్నారు. వాదోపవాదోలు జరుపుతున్నారు. దాంతో ఆ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అయిన ప్రతీ విషయం గొప్పదేమీ కాదు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ..అరటిపళ్ల టాపిక్ వైరల్ గా సోషల్ మీడియాలో మారింది.
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయం హైలెట్ అవుతోంది. ఏదైనా టాపిక్ మొదలైతే దాని అంతు చూడందే వదలం అన్నట్లుగా జనం రెస్పాండ్ అవుతున్నారు. వాదోపవాదోలు జరుపుతున్నారు. దాంతో ఆ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అయిన ప్రతీ విషయం గొప్పదేమీ కాదు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ..అరటిపళ్ల టాపిక్ వైరల్ గా సోషల్ మీడియాలో మారింది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ షూటింగ్ నిమిత్తం చండీగఢ్ వెళ్లిన రాహుల్ అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశాడు. జిమ్కు వెళ్లొచ్చి రెండు అరటి పండ్లకు ఆర్డర్ ఇచ్చాడు. పండ్లతోపాటు వచ్చిన బిల్లు చూసి నోరెళ్లబెట్టాడు. వాటిపై ఏకంగా రూ.442.50 బిల్లుండడంతో హీరోగారి మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే కాసేపటి తర్వాత బిల్లు సంగతి ఏంటా అని పరిశీలించి చూడగా, సెంట్రల్ జీఎస్టీ కింద రూ.33.75, యూటీ జీఎస్టీ కింద మరో రూ.33.75 వేసి మొత్తం బిల్లును రూ.442.50గా చూపించారు. దాంతో తాను రెండు అరటిపండ్లు తిన్నానని వాటి రేటు దిమ్మతిరిగేలా ఉందని, అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ట్వీట్ చేశాడు రాహుల్ బోస్. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక రాహుల్ బోస్ ట్వీట్పై కొందరు కామెంట్లు చేశారు. తాజా పండ్లపై జీఎస్టీ వేయడం అన్యాయమని ఒకరు.. పట్టపగలే దోచేస్తున్నారని మరొకరు కోపం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసారు. ‘అయినా, భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ఆ హోటల్ ఉండటమెందుకు.. వేరొక లగ్జరీ రూమ్లోకి షిఫ్ట్ కావొచ్చు కదా’ అని ఇంకొకరు బోస్కి సలహా ఇస్తున్నారు.
‘సినిమా హాళ్లలో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. టికెట్లు, పాప్కార్న్కు భారీగా వసూలు చేస్తున్నారు. నువ్ మరో హోటల్కి మారడం మంచిది. అరటి పండ్లు బయట కూడా దొరుకుతాయి. అక్కడ కొనుక్కో’అని ఇంకో అభిమాని సూచించాడు. దిల్ దడ్కనే దో, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ది జపనీస్ వైఫ్, విశ్వరూపం-2 సినిమాల్లో బోస్ నటించారు.