రాశీఖన్నా మదర్స్ డే సందర్భంగా తన అమ్మని భారీగా సర్‌ప్రైజ్‌ చేసింది. పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచింది. 

స్టార్‌ హీరోయిన్‌ రాశీఖన్నా(Raashi Khann) మదర్స్ డే(Mothers Day) సందర్భంగా తన అమ్మని భారీగా సర్‌ప్రైజ్‌ చేసింది. పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచింది. ఏకంగా లగ్జరీ కారుని కొనిచ్చి షాక్‌కి గురి చేసింది. మదర్స్ డే సందర్భంగా రాశీఖన్నా తన అమ్మకి బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. తాజాగా ఆయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అమ్మ అంటేనే సృష్టికి మూలం. అమ్మ లేనిదే సృష్టి లేదు. అలాంటి అమ్మకి, మనకు జన్మనిచ్చిన అమ్మకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ ఇలాంటి గిఫ్ట్ లు ఆమెని సంతోషపరుస్తాయని చెప్పొచ్చు. 

అలానే తన దైన స్టయిల్‌లో తన అమ్మని సర్‌ప్రైజ్‌ చేసింది రాశీఖన్నా(Raashii Khanna). కోటీ నలభై లక్షల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కారుని బాహుమతిగా ఇచ్చిన షాకిచ్చింది. వరుస సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ రాశీఖన్నా ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మతోనే గడిపింది. అమ్మతో సముద్రపు లొకేషన్‌లో దిగిన ఫోటోని పంచుకుంటూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం అమ్మకి కారు గిఫ్ట్ ఇచ్చింది. షోరూమ్‌లో బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేస్తున్నప్పుడు దిగిన ఫోటోలు, వాళ్ల అమ్మ కారులో కూర్చొని ఉన్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రాఖీఖన్నా ఫాదర్‌ కూడా ఉన్నారు. 

రాశీఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ ని పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ ని జరుపుకుంటోంది. మరోవైపు గోపీచంద్‌తో కలిసి `పక్కా కమర్షియల్‌ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో నాలుగు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తుంది. దీంతోపాటు `ఫర్జీ` అనే హిందీ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తుంది రాశీఖన్నా. మరోవైపు ప్రభాస్‌-మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ రాశీఖన్నా పేరు వినిపిస్తుంది.