Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో అల్లు అర్జున్‌ రచ్చ.. `పుష్ప 2` షూటింగ్ స్టార్ట్

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్‌ స్టార్ట్ చేశారు. `పుష్ప2` షూటింగ్‌ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బన్నీ ఈ చిత్రీకరణలో హల్‌చల్‌ చేస్తున్నారు.

pushpa 2 shooting start from today allu arjun hulchul in hyderabad
Author
First Published Dec 13, 2022, 3:45 PM IST

అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆయన రచ్చ మొదలైంది. నేడు మంగళవారం(డిసెంబర్‌ 13) హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోలో `పుష్ప2` షూటింగ్‌ ప్రారంభమైంది. చాలా రోజులుగా షూటింగ్‌కి గ్యాప్‌ వచ్చిన విషయం తెలిసిందే. అనేక కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో తాజాగా మంగళవారం `పుష్ప2` షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌ పాల్గొంటుండటం విశేషం. అయితే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రీకరణ ప్రారంభించారు. 

ఇటీవలే అల్లు వారి స్టూడియోని ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా దీన్ని లాంచ్‌ చేశారు. ఇప్పుడు షూటింగ్‌ లు కూడా స్టార్ట్ చేశారని సమాచారం. అయితే రెండు రోజులపాటు ఈ స్టూడియోలో షూటింగ్‌ జరుపుతారని, ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్‌ కొనసాగుతుందని తెలుస్తుంది. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉండనుందట. అనంతరం బ్యాంకాక్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారట దర్శకుడు సుకుమార్‌. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇందులో బైక్‌లో బన్నీ వెళ్తున్నట్టుగా ఉంది. నెట్టింట ఈ పిక్ చక్కర్లు కొడుతుంది. తాజా షెడ్యూల్‌ పిక్‌ అని టాక్‌. మరోవైపు త్వరలోనే అభిమానులకు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు బన్నీ. `పుష్ప` మొదటి భాగం గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన విషయం తెలిసిందే. ఏడాది పూర్తయిన సందర్బంగా `పుష్ప2`కి సంబంధించిన వీడియో గ్లింప్స్ రిలీజ్‌ చేయబోతున్నారట. 

ఈ నెల 16న ఇండియాలో `అవతార్‌ 2` విడుదల కానుంది. `అవతార్‌2` ప్రదర్శించే థియేటర్లలో `పుష్ప2` వీడియో గ్లింప్స్ ని ప్రదర్శించబోతున్నారని సమాచారం. దీంతో బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తప్పవని చెప్పొచ్చు. అందుకోసం వారంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో ఎర్రచందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ నటిస్తున్నారు. శ్రీవల్లిగా బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. నెగటివ్‌ రోల్‌లో ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. 

మొదటి భాగంలోని ఆర్టిస్టులు కొనసాగడంతోపాటు కొత్త ఆర్టిస్టులు ఈ రెండో భాగంలో జాయిన్‌ అవుతారట. మరోవైపు మొదటి సినిమాలో సమంతతో `ఊ అంటావా మావ.. `అనే ఐటెమ్‌ సాంగ్‌ పెట్టారు. అది సంచలనం సృష్టించింది. రెండో భాగంలోనూ అలాంటి ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుందని, బాలీవుడ్‌ భామతో చేయించాలనుకుంటున్నట్టు టాక్‌. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు టాక్‌.
 

Follow Us:
Download App:
  • android
  • ios