హిట్స్ ఉంటేనే మహేష్ చేస్తాడు.. నాకూ క్యారెక్టర్ ఉంది.. పూరి సంచలనం!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మాస్ సెంటర్స్ నుంచి ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోతున్నాయి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మాస్ సెంటర్స్ నుంచి ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోతున్నాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఇస్మార్ట్ శంకర్ టీం బిజీగా పాల్గొంటోంది.
పూరి జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకరకంగా ఇవి వివాదాన్ని రేపే వ్యాఖ్యలే. మహేష్ అభిమానులు పూరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇంతకీ పూరి ఏమన్నాడంటే..
ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ 'జన గణ మన' చిత్ర ప్రస్తావన తీసుకు వచ్చారు. చాలా రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ ని మహేష్ తో చేయబోతున్నట్లు పూరి ప్రకటించారు. ఆ తర్వాత పూరికి వరుస ప్లాపులు ఎదురుకావడంతో ఈ చిత్రం అటకెక్కింది. ఈ చిత్రాన్ని చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. చేస్తాను.. అంతకంటే ముందుగా మహేష్ అభిమానులకు ఓ విషయం చెప్పాలి.
మహేష్ బాబుతో రెండు సూపర్ హిట్స్ తీసా. అందువల్ల మహేష్ అభిమానులు నన్ను చాలా బాగా చూసుకుంటారు. నా పట్ల ఎంతో అభిమానాన్ని చూపిస్తారు. ప్రతి రోజు సోషల్ మీడియాలో.. మహేష్ తో జన గణ మన సినిమ చేయి పూరి భయ్యా అని అడుగుతూనే ఉంటారు. వాళ్లందరికీ నేను చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మహేష్ హిట్స్ లో ఉంటేనే సినిమా చేస్తాడు.. ఈ విషయం అభిమానులకు తెలియదు.
నాకు మహేష్ కంటే మహేష్ అభిమానులు ఇష్టం. కనీసం వారికి నాపై నమ్మకం ఉంది అని పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్మార్ట్ శంకర్ హిట్టయితే సినిమా కోసం మహేష్ మిమ్మల్ని పిలుస్తాడేమో అని యాంకర్ ప్రశ్నించగా.. నేను ఓకే చెప్పడానికి నాకు ఓ క్యారెక్టర్ ఉంది కదా అని తేల్చి చెప్పేశాడు.
పూరి జగన్నాధ్ మాటలని బట్టి మహేష్ తో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో పోకిరి,బిజినెస్ మ్యాన్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.