ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K లాంఛ్... గొప్ప గౌరవం అంటూ అమితాబ్ ట్వీట్
ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్ లో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. అమితాబ్ పై ప్రభాస్ క్లాప్ కొట్టారు. కాగా లెజెండరీ నటుడు అమితాబ్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ వరుసగా లైన్ లోకి తెస్తున్నారు. మూడు చిత్రాలు సెట్స్ ఫై ఉండగానే, మరో మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.
ఆదిపురుష్, సలార్ చిత్రాల కంటే ముందు దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత అశ్వినీ దత్ తెలియజేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. హీరోయిన్ గా దీపికా పదుకొనెను ఎంపిక చేసిన టీమ్, ఓ కీలక రోల్ కోసం అమితాబ్ ని తీసుకున్నారు.
నేడు ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్ లో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. అమితాబ్ పై ప్రభాస్ క్లాప్ కొట్టారు. కాగా లెజెండరీ నటుడు అమితాబ్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారు. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సినిమాటిక్ వేవ్స్ పంచిన ప్రభాస్ లాంటి నటుడు తనపై క్లాప్ కొట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ప్రభాస్ పై అమితాబ్ ట్వీట్ వైరల్ గా మారింది.