Asianet News TeluguAsianet News Telugu

‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్’ ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ చివర్లో మరో సీక్వెల్ రాబోతున్నట్టు ప్రశాంత్ నీల్ ఇచ్చిన హింట్ పై తాజాగా ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చారు.  
 

Producer Clarity on KGF Chapter3! Since then the shooting has started
Author
Hyderabad, First Published May 14, 2022, 12:59 PM IST

భారీ అంచనాల మధ్య విడుదలైన ' కేజీఎఫ్ 2' .. ఎక్సపెక్టేషన్స్ ని దాటుకుని దూసుకుని వెళుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఈ చిత్రం తర్వాత పార్ట్ పై పడింది.  ‘కేజీఎఫ్’ రెండో పార్ట్ చివర్లో ఈ మూవీకి మరో సిక్వెల్ రాబోతుందనే దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పార్ట్ 3పై తాజాగా కారిటీ ఇచ్చారు. 

దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో భారీ చిత్రం ‘సలార్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ Salaar షూటింగ్ పై అప్డేట్ అందిస్తూ ‘Kgf Chapter 3’పైనా క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. ‘ప్రశాంత్ నీల్ సలార్‌ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఇప్పటికే 35 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి కావచ్చు. 2023లో సలార్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. ఈ చిత్ర విడుదలతోనే  KGF3 షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నాం. 2024లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ సీక్వెల్ ను మార్వెల్ లాగా అద్భుతంగా రూపొందించనున్నాం’ అని వెల్లడించారు.   

ఇకపోతే, హై యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న సలార్ చిత్రాన్ని హుంబాలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘సలార్’ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో సలార్ పాత్రను ప్రభాస్ పోషిస్తున్నారు. హీరోయిన్ గా ఎంపికైన శృతి హాసన్ ఆధ్య పాత్రలో నటిస్తోంది. కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, మధు గురుస్వామి, సలార్ తల్లిగా ఈశ్వరీరావు నటిస్తున్నారు. కేజీఎఫ్ ను అత్యద్భుతంగా నిర్మించిన టెక్నికల్ టీం సలార్ కూ పనిచేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios