Asianet News TeluguAsianet News Telugu

హఠాత్తుగా #NTR31 ట్రెండింగ్,అసలు రీజన్ ఇదే


నిన్నటినుంచీ ఎన్టీఆర్ #NTR31 సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.  నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రశాంత్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆ సంస్థ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించాక పోయినప్పటికీ హఠాత్తుగా ఈ ట్రెండింగ్ కు కారణం ఏమిటీ అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
 

Prashanth Neel to direct NTR after Salaar jsp
Author
Hyderabad, First Published Feb 11, 2021, 12:38 PM IST

ఇలా ట్రెండింగ్ లో నిలవటానికి కారణం ఒకటే....ఉప్పెన సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా నిర్మాత‌లు ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ఉంటుంద‌ని క‌న్‌ఫాం చేయటమే. దీంతో ఫ్యాన్స్ ఆనందాన‌కి అవ‌ధులు లేకుండా పోయాయి. దాంతో ఈ మూవీ పాన్ ఇండియా మూవీ ట్రెండింగ్ లో నిలుస్తోంది. 

‘కేజీఎఫ్’ సీక్వెల్ జులై 16న థియేటర్లకు వస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్... ప్రభాస్ తో ‘సలార్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో త‌న తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు ప్రశాంత్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ  చిత్రానికి రేడియేష‌న్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

ఆ మధ్యన ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా .. ‘మీరు పక్కనుంటే న్యూక్లియర్‌ ప్లాంట్‌ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్‌ సూట్‌ ధరించి మీ వద్దకు రాబోతున్నా’ అని ప్రశాంత్‌నీల్ కామెంట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంద‌ని క‌న్‌ఫాం అయ్యారు.

ఆ తర్వాత  ప్ర‌శాంత్ నీల్ ‌ జన్మదినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌  ‘గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్‌ సూట్‌లో కలవబోతున్నాం’ అని తమ అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేయడంతో ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా ప‌క్కా అనే నిర్ణ‌యానికి వ‌చ్చారు ఫ్యాన్స్ . ఇప్పుడు మరోసారి మైత్రీమూవీస్ వారు ఖరారు చేసి చెప్పినట్లు అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios