ఎన్టీఆర్ ముందు రాంచరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు.. ధమాకా రైటర్ అలా పోల్చాడు ఏంటి ?
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి అభిమానుల ముందుకు వచ్చారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ చిత్రం ఈ నెల 22న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి అభిమానుల ముందుకు వచ్చారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ చిత్రం ఈ నెల 22న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎన్టీఆర్ రావడంతో ధమ్కీ ప్రీరిలీజ్ వేడుకలో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో కానీ అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతుంటే.. మరోవైపు తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర క్రెడిట్ తమహీరోకే దక్కాలి అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.
ఈ తరుణంలో ఎలాంటి సంఘటన జరిగినా భూతద్దంలో పెట్టి చూస్తారు. ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ధమాకా రచయిత ప్రసన్న కుమార్ కుమార్ కూడా హాజరయ్యారు. ప్రసన్న కుమార్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రసన్న కుమార్ ఎన్టీఆర్ ని పొగిడేందుకు రాంచరణ్ సన్నివేశాన్ని రిఫరెన్స్ గా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'జనతా గ్యారేజ్ లో ఒక డైలాగ్ గుర్తొస్తోంది. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి వెనుక కూడా ఒక బలం ఉంది.. జనతా గ్యారేజ్. ఇక్కడ ఒక చిన్న సినిమా వెనుక పెద్ద హీరో ఉన్నాడు.. ఎన్టీఆర్ అంటూ ప్రసన్న కుమార్ తారక్ ఫ్యాన్స్ తో కేకలు పెట్టించాడు.
తారక్ అన్న ఇక్కడకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అన్న అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నప్పుడు వెనుకాల పెద్ద లైట్ పడుతుంది. అది ఒక స్కై లెవల్ ఎలివేషన్ లాగా ఉంటుంది. ఈ చిత్ర ఈవెంట్ మీరు రావడం ఆ లైట్ లాంటిదే అని ప్రసన్న కుమార్ అన్నారు. ఈ నిమిషం నుంచి ఈ చిత్రం వేరే లెవల్ కి వెళుతుంది అని ప్రసన్న కుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.