Asianet News TeluguAsianet News Telugu

హీరో విశాల్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా ట్వీట్.. ఏం జరిగిందంటే..

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు.  అయితే కెరీర్ ఆరంభంలో ఉన్న జోరు విశాల్ ఇప్పుడు ప్రదర్శించలేకున్నాడు.

Prakash raj satirical tweet on hero Vishal
Author
First Published Nov 3, 2022, 12:48 PM IST

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు.  అయితే కెరీర్ ఆరంభంలో ఉన్న జోరు విశాల్ ఇప్పుడు ప్రదర్శించలేకున్నాడు. విశాల్ నటిస్తున్న చిత్రాలు మెప్పిస్తున్నాయి కానీ బిగ్ హిట్ కావడం లేదు. 

తాజాగా హీరో విశాల్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇద్దరూ హాట్ టాపిక్ గా మారారు. విశాల్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విశాల్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం కాశీని సందర్శించాడు. అక్కడ ఆలయంలో, గంగా నదిలో పూజలు నిర్వహించాడు. 

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ కాశీ పుణ్యక్షేత్రాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశారని ప్రసశంసలు కురిపించాడు. ప్రధాని నరేంద్ర మోడీకి సెల్యూట్ అని కూడా కామెంట్స్ చేశాడు. విశాల్ ట్వీట్ కి నరేంద్ర మోడీ స్పందిస్తూ.. కాశీలో మీకు అద్భుతమైన అనుభూతి కలగడం సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు. 

తాజాగా విశాల్ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. షాట్ ఒకే.. నెక్స్ట్ ? అంటూ కామెంట్ పెట్టాడు. ప్రకాష్ రాజ్ తరచుగా బిజెపికి వ్యతిరేకంగా, మోడీపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇది కూడా ఆ తరహాలోనే అని నెటిజన్లు అంటున్నారు. అయితే విశాల్ మోడీని ప్రశంసించడంతో అతడిపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. 

మోడీని విశాల్ ప్రశంసించడం.. దానికి మోడీ రియాక్ట్ కావడం అంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అనే తరహాలో ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేసారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొందరు నెటిజన్లు మోడీపై వ్యతిరేకత ఉంటే ఇందులోకి విశాల్ ని ఎందుకు లాగడం అని ప్రశ్నిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios