సారాంశం
భయం అన్నదే తెలియని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారి కథతో 'స్పిరిట్' రూపొందనున్నట్టు తెలుస్తోంది.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఇప్పుడు తన లేటెస్ట్ ఫిల్మ్ యానిమల్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. రేపు రిలీజ్ అయ్యితే ఇంక చెప్పక్కర్లేదు. ఈ దర్శకుడు కొత్త సినిమా అంటే జనాల్లో ఆసక్తి చెప్పక్కర్లేదు. అదీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్(Prabhas) తో అయితే.... వీళ్లిద్దరి కాంబినేషన్లో గతంలోనే ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’(Spirit) పేరుతో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. తాజాగా దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
స్పిరిట్ చిత్రాన్ని 2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.యానిమల్ ప్రమోషన్ సందర్భంగా సందీప్ వంగా మాట్లాడుతూ యానిమల్ రిలీజ్ అయిన వెంటనే, స్పిరిట్ పనిని ప్రారంభిస్తానని, సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా రైటింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. యానిమల్ కోసం దాదాపు 18 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. స్పిరిట్ కోసం మాత్రం అంత టైమ్ తీసుకోనని తెలిపాడు. ఎందుకంటే, ప్రభాస్ కు కథ చెబుతున్నప్పుడే, చాలా సన్నివేశాల ట్రీట్ మెంట్ పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు. భయం అన్నదే తెలియని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారి కథతో 'స్పిరిట్' రూపొందనున్నట్టు తెలుస్తోంది.
నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘ప్రస్తుతం సందీప్రెడ్డి ‘యానిమల్’ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ పనులు మొదలుపెడతారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్ని చూస్తారు’’ అని భూషణ్ కుమార్ చెప్పారు. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అప్డేట్స్ త్వరగా ఇవ్వాలంటూ సోషల్మీడియాలో సందడి చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్', అటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', దర్శకుడు మారుతి తో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే 'స్పిరిట్' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? ప్రభాస్ ను ఎప్పుడు ఖాకీ డ్రెస్ లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.