Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్‌ `సాహో` అనిపించి ఏడాది.. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌

నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ప్రభాస్‌ స్టామినా ఏంటో చూపించిన `సాహో సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

prabhas saaho completed one year and trend on social media
Author
Hyderabad, First Published Aug 30, 2020, 4:44 PM IST

`బాహుబలి` వంటి పాన్‌ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌.. తనకు వచ్చిన క్రేజ్‌, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రం `సాహో`. `రన్‌ రాజా రన్‌` ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా, విజువల్‌ వండర్‌గా రూపొంది ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. 

పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలై మెప్పించింది. సినిమా కథ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, విజువల్స్ మంత్రముగ్థుల్ని చేశాయి. దీంతో సినిమా విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన రాబట్టినా, తర్వాత భారీ కలెక్షన్ల వసూళ్ళు చేసి క్రిటిక్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. 

దీనికితోడు ప్రభాస్‌ యాక్షన్‌, శ్రద్ధా కపూర్‌ నటన, అందాలు, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ స్పెషల్‌ సాంగ్‌, వంశీ, ప్రమోద్‌, విక్కీ ల నిర్మాణ విలువలు సినిమాని విజయ తీరానికి చేర్చాయి. ఈ సినిమా తెలుగు కంటే హిందీలోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టింది. హిందీలో టీ సిరీస్‌ విడుదల చేయగా, ఇది అక్కడే దాదాపు రూ. 200కోట్లు వసూలు చేసినట్టు టాక్‌. మొత్తంగా నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ప్రభాస్‌ స్టామినా ఏంటో చూపించింది. ఈ సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

ఇక ప్రభాస్‌ ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని వంశీ, ప్రమోద్‌లతో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios