`ప్రాజెక్ట్ కే` పోస్టర్ సెన్సేషన్.. హీరోలు పుట్టరు, ఉద్భవిస్తారంటూ అంచనాలు పెంచుతున్న నాగ్ అశ్విన్
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న `ప్రాజెక్ట్ కే` నుంచి సర్ప్రైజ్ వచ్చింది. ఓ పవర్ఫుల్ లుక్ని విడుదల చేయగా, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
హీరోలు పుట్టరు, వాళ్లు ఆవిర్భవిస్తారని అంటున్నారు నాగ్ అశ్విన్. `ప్రాజెక్ట్ కే`లో ప్రభాస్ ఆవిర్భవించిన హీరోగా ఆయన అభివర్ణిస్తున్నారు. తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ప్రీ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. పిడికిలి బిగించిన చేతిని చూపించారు. జస్ట్ మోచేతి వరకే చూపించినా, అది అత్యంత పవర్ఫుల్గా ఉండటం విశేషం. ఆ చేయికి రోబో కవచం తొడిగి ఉండటం విశేషం. ప్రభాస్ ఇందులో రోబోగా కనిపిస్తాడా లేక సూపర్ హీరోగా కనిపిస్తాడా అనేది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ సందర్భంగా `హీరోలు పుట్టరు, వాళ్లు ఉద్భవిస్తారు` అనే పేర్కొనడం ఆకట్టుకుంటుంది. సింపుల్గా విడుదల చేసిన పోస్టరే గూస్బంమ్స్ తెప్పించేలా ఉండటం విశేషం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపిన విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్తో కూడిన సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి భారీ కాస్టింగ్తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాని అశ్వినీదత్ సుమార్ 500కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
నేడు ఆదివారం(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులకు `ప్రాజెక్ట్ కే` యూనిట్ చిన్న సర్ప్రైజ్నిచ్చింది. ఈ సందర్భంగా డార్లింగ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమా సెట్లోనూ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సంబరాలు చేశారు. పటాకులు కాల్చి సెలబ్రేట్ చేశారు. ఆ వీడియోని సైతం పంచుకుంది యూనిట్. ఇలా సింపుల్గా సర్ప్రైజ్ చేసింది `ప్రాజెక్ట్ కే` యూనిట్. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో విడుల చేయాలనుకుంటున్నారు. లేదంటే 2024 సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.