లాంఛనంగా ప్రారంభమైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సుజీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ తదుపరి చిత్రం యూవీ క్రియేషన్స్ బేనర్ పై భారీ బజట్ తో రూపొందనున్న ప్రభాస్ మూవీ
భారీ విజయం సాధించిన బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కొత్త చిత్రం ఇవాళే ప్రారంభమైంది. సుజీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బేనర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ 19వప చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ గతంలో మిర్చి లాంటి సూపర్ హిట్ సినిమాను రూపొందించారు.
ప్రభాస్ తాజా చిత్రానికి శంకర్ ఎసాన్ లాయ్ లు సంగీతం అందిస్తుండగా మేధీ సినిమాటోగ్రఫీ చేయనున్నారు. ఇక రోబో, బాహుబలి లాంటి చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సబూ సైరిల్ ఈ చిత్రానికీ పనిచేయనున్నారు.

తెలుగు , తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ముహూర్తం సన్నివేశానికి రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్లు హజరయ్యారు. దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
