ప్రభాస్‌ గాయపడ్డారు. `సలార్‌` చిత్రీకరణలో ఆయనకు గాయాలయ్యాయి. తాజాగా ఆయనకు ఆపరేషన్‌ జరిగిందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ఆసుపత్రి పాలయ్యాడు. ఏకంగా సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త ఇది. ఈ వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు `రాధేశ్యామ్‌` ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఆయన ఆసుపత్రి పాలు కావడం ఏంటని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకి ప్రభాస్‌కి ఏమైందనేది చూస్తే. 

ప్రభాస్‌ ప్రస్తుతం పలు భారీ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. `రాధేశ్యామ్‌`(Radheshyam) విడుదల కాగా, `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణలో ఉన్నాయి. `ఆదిపురుష్‌` పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. అయితే `సలార్‌`(Salaar) భారీ యాక్షన్‌ మూవీ. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌కి గాయమైందట. షూటింగ్‌లో గాయాలపాలు కావడంతో ఆపరేషన్‌ అవసరమైందని తెలుస్తుంది. `రాధేశ్యామ్‌` విడుదలై ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో రిలాక్స్ అయిన ప్రభాస్‌, పెండింగ్‌లో ఉన్న తన సర్జరీని పూర్తి చేసుకోవాలని భావించారట. 

అందులో భాగంగా తాజాగా ఆయన స్పెయిల్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్‌ అనంతరం డాక్టర్లు ప్రభాస్​ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్నడార్లింగ్ ఫాన్స్ ఆందోళన చెందుతున్నాయి. అయితే ఆందోళన పడాల్సింది లేదనే వార్త రావడంతో ఊపిరి తీసుకున్నారు. ప్రభాస్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుని, తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్రభాస్‌ `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణలు పూర్తి చేయబోతున్నారు. మరోవైపు ఏప్రిల్‌ ఫస్ట్ వీక్‌ నుంచి మారుతి చిత్రాన్ని పట్టాలెక్కీయబోతున్నారు. 

అలాగే `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. ప్రభాస్‌ ఇటీవల రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ఈ సినిమా గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనతో రన్‌ అవుతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, కృష్ణంరాజు కూతురు ప్రసీద నిర్మాతలుగా వ్యవహరించారు.