కృష్ణంరాజు మరణం తరువాత సోషల్ మీడియాలో ప్రభాస్ ఫస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా..?
చాలా గ్యాప్ తరువాత సోషల్ మీడియాలో స్పందించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా ప్రభాస్ పెదనాన్న.. అలనాటి స్టార్ హీరో కృష్ణంరాజు మరణం తరువాత ప్రభాస్ ఫస్ట్ టైమ్ నెటింట్లో ఓ పోస్ట్ ను పంచుకున్నారు. ఇంతకీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా..?
ఈ మధ్య జరిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ ఫ్యామిలీ అంతా బాధల్లో మునిగి పోయింది. తండ్రి కంటే ఎక్కువగా తనను ఆదరించిన పెదనాన్న మరణంతో ప్రభాస్ కూడా చాలా డల్ అయిపోయాడు. చాలా రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. ఇంట్లో కార్యక్రమాలకు పరిమితం అయ్యాడు. ఇప్పటికీ ఆయన ఎప్పుడు షూటింగ్స్ లో జాయిన్ అవుతాడో కూడా తెలియదు. ఇక ప్రభాస్ కు రాష్ట్ర. జాతీయ నాయకుల నుంచి సంతాపాలు కూడా అందాయి.
కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అంచలంచలుగా ఎదిగి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పెదనాన్న మరణం బాధనుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతన్న ప్రభాస్.. రీసెంట్ గా సోషల్ మీడియాలో స్పందించారు. ప్రభాస్ సోషల్ మీడియా అకౌంట్ కూడా ఈ మధ్యే ఓపెన్ చేశారు. అప్పుడప్పుడు మాత్రమే.. ఇంపార్టెంట్ విషయాలలో స్పందిస్తూ ఉంటారు. కృష్ణం రాజు మరణం తరువాత ఆయన రీసెంట్ గా ఎమోషనల్ పోస్ట్ ను ఇన్ స్టాలో శేర్ చేశారు.
ప్రస్తుతం ఆ పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఓ వీడియోను శేర్ చేశారు. అందులో ఏముందంటే.. ప్రభాస్ అభిమానులు కృష్ణంరాజు, ప్రభాస్ సినిమాల్లోని పలు సన్నివేశాలను జత చేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా అదే వీడియోను ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. హార్ట్ సింబల్తోపాటు.. దండం పెడుతున్న ఏమోజీని షేర్ చేశారు. అంతే కాదు ఈ వీడియో చేసిన అభిమానులకు స్పెషల్ గా థ్యాంక్స్ కూడా చెప్పారు ప్రభాస్.
ఆ వీడియోలో ప్రభాస్, కృష్ణంరాజు ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చేశారు. ఇద్దరు స్టార్లు సీన్స్ ను సింక్ చేస్తూ వీడియోను అద్భుతంగా తీర్చి దిద్దారు ఫ్యాన్స్. అంతే కాదు ఈ సీన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోకు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరో ఎత్తు. బ్యాగ్రౌండ్లో ప్రభాస్ నటించిన చత్రపతి సాంగ్ థీమ్ వచ్చేలా వీడియోను రూపోందించారు. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సొంత గ్రామం మొగల్తూరులో ఈనెల 29న కృష్ణంరాజు స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ సభను 70 వేల మందితో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్- కృష్ణం రాజు కలిసి కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. రెబల్, బిల్లా లాంటి సినిమాలో ఇద్దరూ పవర్ ఫుల్ పాత్రల్లో అలరించారు. ఇక చివరిగా రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో ఇద్దరు చివరి సారిగా నటించారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో సలార్, ఆదిపురుష్ రిలీజ్ కు ముస్తాబు అవుతుండగా.. ప్రాజెక్ట్ కే తో పాటు సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్, మారుతి డైరెక్షన్ లో మరో సినిమా లైన్ లో ఉన్నాయి.