ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడు అనేది ట్రైలర్ లో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్రూరుతున్నారు. తాజాగా ఈమూవీ టీమ్ ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేసేసింది. 

దేశ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో పాటు.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈసినిమా.. నుంచి ట్రైలర్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. టీజర్ తో నిరాశపరిచిన టీమ్.. ట్రైలర్ తో అయినా ఇంప్రెషన్ తెచ్చుకుంటుందా అనేది ఆసక్తి కరంగా మారింది. ఇక ఆదిపురుష్‌ మూవీ ట్రైలర్ లాంచ్ కు టైమ్ వచ్చేసింది. మే 9న గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది ఆదిపురుష్ టీమ్. 

ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్‌ నుంచి పాన్ ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు టీమ్. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ ను సాధించింది ఆదిపురుష్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అప్ డేట్స్.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో రెడీ అయ్యింది ఆదిపురుష్. 

భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా & దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ గొప్ప భారత ఇతిహాస కథ ప్రపంచ ప్రేక్షకులను ఓ సాహసోసేతమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది.

ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ జానకిగా.. సైఫ్ అలీఖాన్ రావణబ్రహ్మగా.. సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌.. ఓం రౌత్ డైరెక్షన్ లో తెరుకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో జూన్ 16న రిలీజ్ కాబోతోంది.