Asianet News TeluguAsianet News Telugu

‘ఆచార్య’ మైలేజ్ ని,ప్రభాస్ క్రేజ్ ని వాడేస్తున్న సుశాంత్


సినిమా వాళ్ల లెక్కలేవారు.తమ ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకురావటానికి రకరకాల మార్గాలు ఎప్పటికప్పుడు అన్వేషిస్తూంటారు. ముఖ్యంగా మీడియం రేంజి హీరోల సినిమాలు, చిన్న ప్రాజెక్టులకు బూస్ట్ ఇవ్వాలంటే పెద్ద స్టార్స్ చెయ్యపడాల్సిందే. ఫస్ట్ లుక్,టీజర్ దగ్గర నుంచి అన్ని పెద్ద స్టార్స్ ని సీన్ లోకి తీసుకొచ్చి జనాల దృష్టి వాటిపై పడేలాగ చేస్తారు. ఇప్పుడు సుశాంత్ కూడా అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. తన కొత్త సినిమాకు అటు చిరు మైలేజ్ ని, ప్రభాస్ క్రేజ్ ని వాడేస్తున్నాడు. అదెలాగంటే...,

Prabhas  accepting to launch IVNR teaser on 29th jsp
Author
Hyderabad, First Published Jan 28, 2021, 8:45 AM IST

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా సందడి చేయనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధగా కీలకపాత్రను పోషిస్తున్నారు. చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన... ‘ఆచార్య’ పోస్టర్‌‌, భారీ ఆలయం సెట్‌, ఇటీవల విడుదల చేసిన సిద్ధ బ్యాక్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

 శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’  సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌, గుడి సెట్‌ వీడియో, సిద్ధగా రామ్‌చరణ్‌ బ్యాక్‌లుక్‌ మినహా ఈ సినిమాకు సంబంధించిన ఏ విశేషాన్ని చిత్ర బృందం అభిమానులతో పంచుకోలేదు. ఈ నేపథ్యంలో టీజర్‌ ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రబృందం నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. 

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ విడుదల తేదీని తెలియజేస్తూ బుధవారం ఓ సరికొత్త వీడియోను అభిమానులతో పంచుకున్నారు. దాంతో అందరూ 29 సాయింత్రం వచ్చే అప్ డేట్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఖచ్చితంగా సినిమా అభిమానులంతా ఎలర్ట్ గా ఉంటారు. 

ఈ విషయాన్ని తమకు అనుకూలంగా  మార్చుకోవాలనుకున్నారు సుశాంత్ కొత్త చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' టీమ్.  'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్‌ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ని సైతం రేపు అంటే జనవరి 29నే విడుదల చేస్తున్నారు. ప్రభాస్ చేత ఈ టీజర్ ని లాంచ్ చేయిస్తున్నారు.  అలా చిరంజీవి సినిమాకు వచ్చే క్రేజ్ తమ సినిమాకు వాడేసుకోబోతున్నారన్నమాట. మంచి స్ట్రాటజీ కదా.

https://twitter.com/iamSushanthA/status/1354423851619209225

ఎస్‌.ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'  చిత్రాన్ని ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సుశాంత్‌, మీనాక్షి చౌధ‌రి, వెంక‌ట్‌, వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య‌, నిఖిల్ కైలాస‌, కృష్ణ‌చైత‌న్య‌ ఈ సినిమాలో నటిస్తున్నారు.

సాంకేతిక బృందం:
సంగీతం:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు

సినిమాటోగ్ర‌ఫీ: ఎం. సుకుమార్‌

ఎడిటింగ్‌:  గ్యారీ బీహెచ్‌

సంభాష‌ణ‌లు:  సురేష్ భాస్క‌ర్‌

ఆర్ట్‌:  వి.వి.

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

నిర్మాత‌లు: ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల 

ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌. ద‌ర్శ‌న్‌

బ్యాన‌ర్స్‌:  ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios