సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని.. ఇటీవల చేసిన సర్జరీ కూడా వికటించిందని వైద్యులు శక్తివంచన లేకుండా ఆయనకి చికిత్స అందిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీటిపై స్పందించిన పోసాని.. తనే స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. కొన్నాళ్లుగా తనకు ఆరోగ్యం బాగాలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. నిజంగానే తనకు ఆరోగ్యం బాగాలేదని.. కానీ చచ్చిపోయేంత సీరియస్ కాదని.. డాక్టర్లు తనను ఆరోగ్యవంతుడిగా చేశారని, కాబట్టి తన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. పది రోజుల్లో తిరిగి షూటింగ్ కి వెళ్తానని.. తెరపై కనిపిస్తానని చెప్పారు.

పోసానికి ఆరోగ్యం సరిగ్గా లేని మాట నిజమే.. ఆయనకి సర్జరీ జరిగిన మాట కూడా వాస్తవమే.. కానీ ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన రొటీన్ చెకప్ కోసం యశోదా హాస్పిటల్ కి వెళ్లడంతో మరోసారి అతడి ఆరోగ్యంపై పుకార్లు పుట్టించారు.