సీఎం రిలీఫ్ ఫండ్కి లైకా ప్రొడక్షన్ భారీ విరాళం ..
ప్రముఖ సౌత్ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ తమిళనాడు ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాతో పోరులో తమ వంతు సాయం ప్రకటించింది. శనివారం లైకా ప్రతినిధులు సీఎం స్టాలిన్ని కలిసి చెక్ని అందజేశారు.
ప్రముఖ సౌత్ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ తమిళనాడు ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాతో పోరులో తమ వంతు సాయం ప్రకటించింది. లైకా ప్రొడక్షన్ నుంచి ఏకంగా రూ. రెండు కోట్లు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసింది. శనివారం లైకా ప్రతినిధులు సీఎం స్టాలిన్ని కలిసి రెండు కోట్ల చెక్ని అందజేశారు. దీంతో కరోనా సెకండ్ వేవ్లో సినిమా రంగం నుంచి అత్యధికంగా విరాళం ప్రకటించిన సంస్థగా లైకా నిలిచింది.
లైకా ప్రొడక్షన్స్ కి నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ అధినేతగా ఉన్నారు. తన తరపున లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ సచివాలయంలో సీఎంకి అందజేశారు. లైకా తమిళంలో అనేక భారీ చిత్రాలను నిర్మిస్తుంది. తెలుగులో చిరంజీవి రీఎంట్రీ చిత్రం `ఖైదీ నెంబర్ 150`, తమిళంలో విజయ్ తో `కత్తి`, రజనీకాంత్ `2.0`, `దర్బార్`, `కప్పన్'(బందోబస్త్) చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు `భారతీయుడు 2`, `పొన్నియిన్ సెల్వన్`, `రామ్ సేతు`, `గుడ్ లక్ జెర్రీ` చిత్రాలను నిర్మిస్తుంది.