Asianet News TeluguAsianet News Telugu

విషాదం: ప్రముఖ టీవీ నటి ఉమా మహేశ్వరి కన్నుమూత..

ప్రముఖ తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) కన్నుమూశారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. 

popular tv actress uma maheswari passed away
Author
Hyderabad, First Published Oct 18, 2021, 8:01 AM IST

 కోలీవుడ్‌ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) కన్నుమూశారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. `మొట్టి ఒళి` టీవీ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉమా మహేశ్వరి. `ఒరు కథైయిన్‌ కథై`, `మంజల్‌ మహిమై` వంటి సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించి టీవీ ఆడియెన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైంది. 

సీరియల్స్ లోనే కాదు,సినిమాల్లోనూ నటించింది. `వెట్టిచాకిరి`, `కొడికట్టు`, `అల్లి అర్జున్‌` వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పింది. అటీ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా రంగంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 

ఉమామహేశ్వరి భర్త మురుగన్‌. ఆయన పశువైద్యుడు. వివాహానంతరం ఉమా మహేశ్వరి నటనకు స్వస్తి చెప్పారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios