Asianet News TeluguAsianet News Telugu

పూజా హెగ్డేపై మరో రూమర్.. చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్న మేనేజర్!

 

టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజీ చిత్రాలతో దూసుకుపోతోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

Pooja Hegde and her manager booked for drunk and drive is fake news
Author
Hyderabad, First Published May 9, 2019, 3:18 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజీ చిత్రాలతో దూసుకుపోతోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహర్షి తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ చిత్రాలలో నటించనుంది. గత కొన్ని రోజులుగా పూజా హెగ్డేని రూమర్లు వెంటాడుతున్నాయి. 

వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రానికి గాను పూజా హెగ్డే కేవలం 15 రోజులకు 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అసత్యం అంటూ వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటి ఇచ్చారు. తాజాగా మరో వార్త పూజా హెగ్డే, ఆమె మేనేజర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ ముగించుకుని పూజా హెగ్డే, ఆమె మేనేజర్ ఓ 7 స్టార్ హోటల్ కు వెళ్లారట. 

హోటల్ నుంచి వీరిద్దరూ కారులో విమానాశ్రయానికి వెళుతుండగా పోలీసులు పూజా హెగ్డే మేనేజర్ ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. పూజా పూజా హెగ్డే ప్రయాణిస్తున్న కారుని పోలీసులు సీజ్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీనితో మరో మరో కారులో పూజా హెగ్డే వెళ్లిపోయిందట. ఆమె మేనేజర్ పై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలపై పూజా హెగ్డే, ఆమె మేనేజర్ ఇద్దరూ షాక్ కి గురైనట్లు తెలిసింది. అసలు అలాంటి సంఘటనే జరగలేదని, జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవం అని పూజా హెగ్డే మేనేజర్ స్పందించారు. తమపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నవారిపై పూజా హెగ్డే మేనేజర్ చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios