పీఎం నరేంద్రమోదీ పుట్టిన రోజు.. మంచు ఫ్యామిలీ ప్రత్యేక శుభాకాంక్షలు.. మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి విషెస్.!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెతున్నాయి. తాజాగా మంచు వారి ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రెండు పర్యాలు దేశానికి ప్రధాని ఎన్నికైన నరేంద్రమోదీ ప్రజామోదన పాలన సాగిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. దేశ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆయన 72వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, దేశ ప్రజలు, బీజేపీ శ్రేణీలు, అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన మరింత ఆయుష్సును కలిగి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదికన హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.
తొలుత మంచు మోహన్ బాబు (Mohan Babu) ట్వీట్ చేస్తూ.. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అనుభవ సంపద చాలా రకాలుగా మమ్మల్ని సానుకూలంగా ప్రభావితం చేసింది. మీరు మన దేశం గర్వపడేలా చేస్తున్నారు. మీకు దీర్ఘాయువుతో పాటు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను. మన భారతదేశం కోసం మీరు కన్న కలలన్నీ నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’ అని విషెస్ తెలిపారు.
అలాగే ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘గొప్ప నాయకులలో ఒకరైన నరేంద్ర మోడీ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి. మన ప్రధాన మంత్రి భవిష్యత్ లో ఆరోగ్యంగానూ, బలంగానూ, ఆనందంగానూ ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ ద్వారా విష్ చేశారు. ఇక మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా ప్రధానికి స్పెషల్ విషెస్ తెలిపింది.
ట్వీట్ చేస్తూ ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తింది. ‘తాను ఎదుర్కోలేని సంక్షోభం లేదు.. అధిగమించలేని సవాళ్లు లేవని పదే పదే రుజువు చేసిన లివింగ్ లెజెండ్ భారత ప్రధాని, నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ, భారతదేశాన్ని మరింత ఐక్యంగా మారర్చుతూ, ప్రజలకు అండగా నిలుస్తుండటం సంతోషంగా ఉంద’ని పేర్కొంది. మరోవైపు ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లో ఎనిమిది చిరుతలను వదిలిపెట్టడం విశేషం.