Asianet News TeluguAsianet News Telugu

#Rashmika: రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని

ఈ ట్వీట్ పై  ప్రధాని మోదీ  స్పందించారు. ఆయన రిప్లై ఇస్తూ..."ఖచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు."  అన్నారు.
 

PM Modi Reacts To Rashmika Madanna Appreciation Post For Atal Setu Bridge jsp
Author
First Published May 17, 2024, 8:46 AM IST


లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట సినీ నటి రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ పార్టీ పేరునూ ప్రస్తావించని ఆమె.. అభివృద్ధికి ఓటేయండంటూ ఆమె తన ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. భారత్‌లోనే అతిపెద్ది సీ లింక్ బ్రిడ్జ్‌గా గుర్తింపు పొందిన ముంబైలోని ‘అటల్ సేతు’పై నుంచి మాట్లాడిన రష్మిక.. మీ కళ్లు తెరవండి అంటూ వీడియోలో మాట్లాడారు. 

22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఆరు లేన్ల వంతెన ప్రయాణ సమయాన్ని 2 గంటల నుంచి కేవలం నిమిషాలకు తగ్గిస్తుందని ఆమె చెప్పారు. భారత్ పెద్ద కలలు కలలేదన్నారు కానీ.. కేవలం ఏడేళ్లలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. అటల్ సేతుతో వికసిత భారత్‌కి ద్వారాలు తెరుచుకున్నాయన్న రష్మిక.. ఇది కేవలం బ్రిడ్జి కాదు మన యువ భారత్‌కు గ్యారంటీ అన్నారు. 

ఇలాంటి వందలాది అటల్ సేతులు నిర్మించాలంటే.. మేల్కొని డెవలప్‌మెంట్‌కు ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. సౌతిండియా టు నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా టు ఈస్టిండియా.. కనెక్టింగ్ హార్ట్స్.. మై ఇండియా అంటూ ఆమె ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏ పార్టీకి ఓటేయాలో చెప్పనప్పటికీ.. ఆమె ఎవరి కోసం ఈ వీడియో చేసిందో నెటిజన్లకు క్లియర్‌గానే అర్థమైంది.

ఇక ఈ ట్వీట్ పై  ప్రధాని మోదీ  స్పందించారు. ఆయన రిప్లై ఇస్తూ..."ఖచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు."  అన్నారు.

ఇక రష్మిక కెరీర్ పరంగా ఆ మధ్యన కొద్దిగా వెనకబడినట్లు అనిపించింది కానీ యానిమల్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. కమర్షియల్ హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది.  నార్త్‌లో , సౌత్‌ తేడా లేకుండా కుమ్మి పడేస్తున్న ఈ నేషనల్‌ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నాలుగు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె కాన్సర్టేషన్ మొత్తం వాటిపైనే ఉంది.  అవేమిటంటే..
 
అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబోలో రూపొందుతున్న  “పుష్ప 2″లో ఆమె నటిస్తుంది. అలాగే శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రంలో చేస్తోంది. ఇక వీటితో పాటు  విక్కీ కౌశల్‌తో ‘ఛావా’లో తెరపై కనిపించనుంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది రష్మిక.   తెలుగులో ఆమె ఇప్పుడు “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాలో నటిస్తోంది.  ఆ తర్వాత తెలుగు- తమిళ భాషల్లో రూపొందుతోన్న “రెయిన్ బో” అనే సినిమాకి సంబంధించిన మిగిలిన భాగం పూర్తి చెయ్యాలి. మిగతా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ 2024లో తన డేట్స్ ని బట్టి ఒప్పుకుంటుందట. ఒక్కసారిగా రష్మిక ఇప్పుడు తీరికలేనంతగా బిజీ అయిపోయింది.

వీటితో పాటు  ఆమె ఓ సినిమా స్పెషల్ కామియో రోల్ లో కనిపించబోతోందని సమాచారం. అదీ.. ఓ స్పెషల్‌ సాంగ్‌లో అని రీసెంట్ గా షూటింగ్ జరిగిందని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటే... విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.ఫ్యామిలీ చిత్రాలు డైరక్ట్ చేసి సూపర్ హిట్స్ ఇచ్చే పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక కనపడబోతోంది. అయితే అది కొద్ది సేపే. కథలోని ఓ ప్రత్యేక సందర్భంలో ఓ పాట వస్తుందని సమాచారం.  
 
ఇక యానిమల్ హై సక్సెస్ తో ఇప్పుడు బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు , దర్శకులు రష్మిక డేట్స్ కోసం వెంట పడుతున్నారు. ఐతే, రష్మిక బాలీవుడ్ లో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా కొత్తగా ఒప్పుకొంది. మిగతా ఆఫర్లను ఒప్పుకోలేదు. ముందుగా ఆమె తెలుగులో ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొత్త చిత్రాలు సైన్ చేస్తుంది. ఒక్కసారిగా రష్మిక ఇప్పుడు ఫుల్  బిజీ అయిపోయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios