PM Modi: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ఆయన ఏంచెప్పారనేది ఇందులో తెలుసుకుందాం. 

 PM Modi: విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రారంభం నుంచి హిట్‌ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. అందరూ ఈ సినిమాను పొగుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో  'ఛావా' సినిమా గురించి మాట్లాడి, సినిమాను తెగ పొగిడేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారంటే..

'ఛావా' గురించి మాట్లాడుతూ  'మహారాష్ట్ర, ముంబై మరాఠీ సినిమాలతో పాటు హిందీ సినిమాను కూడా పైకి తీసుకొచ్చాయి. ఇప్పుడు దేశమంతా ఛావా గురించే మాట్లాడుకుంటున్నారు. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఆధారంగా సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని చూపించారు' అని అన్నారు. మోదీ ప్రశంసించారు. పీఎం ప్రశంసలతో సినిమాకి మరింత బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. కలెక్షన్లు కూడా పెరగనున్నాయని సమాచారం. 

View post on Instagram
 

 

చిన్న షార్ట్ వేసుకొని బయటకు వచ్చిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఎక్కడ అంటూ కామెంట్స్

సినిమా కథ ఏంటంటే..

'ఛావా' సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం, ఆయన కష్టాల గురించి చెబుతుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తన నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. రష్మిక మందన్న మహారాణి యేసుబాయి పాత్రలో బాగా చేసింది. విక్కీ, రష్మికతో పాటు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటివరకు 310.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను టాక్స్ ఫ్రీ కూడా చేశారు.

read more: `ఛావా` సినిమా చేయాల్సిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? పాపం మూడో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌ !