Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ని కలుస్తా అంటున్న 'పేకమేడలు' చిత్ర నిర్మాత.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంపై నిహారిక కామెంట్స్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.

Pekamedalu producer Rakesh Varre comments on Prabhas dtr
Author
First Published Jul 20, 2024, 10:09 PM IST | Last Updated Jul 20, 2024, 10:09 PM IST

పేక మేడలు సినిమా కి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు - సక్సెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత రాకేష్ వర్రే

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల గారు మాట్లాడుతూ : స్టార్టింగ్ నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి 50 కాల్స్ పైన వచ్చాయి. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాత రాకేష్ గారికి మా టీం కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు అన్నారు.
Pekamedalu producer Rakesh Varre comments on Prabhas dtr
నిర్మాత రాకేష్ వర్రే గారు మాట్లాడుతూ : దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్కు వస్తారు. అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నాకు ఎంతో సపోర్టుగా నిలిచిన అనూష, కేతన్ అదేవిధంగా మార్కెటింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా వస్తే మరోసారి నిరూపించారు. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. ప్రభాస్ తో మంచి అనుబంధం ఉంది. మూవీ సక్సెస్ అయింది కాబట్టి ప్రభాస్ ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తానని రాకేష్ వర్రే అన్నారు. 

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

ఆగస్ట్ 9న ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ విడుదల

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో  ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఆగ‌స్ట్‌లో వ‌చ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌లవుతుంది. 

చిత్ర స‌మ‌ర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు.  శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ జ‌య‌ల‌క్ష్మిగారితో కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఎక్కువ మంది కొత్త వాళ్ల‌తోనే సినిమాను పూర్తి చేశాం. య‌దు వంశీగారు మంచి ప్లానింగ్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలోనే పూర్తి చేయ‌టం విశేషం. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రికీ న‌చ్చే సినిమాతో ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాం’’ అన్నారు.
Pekamedalu producer Rakesh Varre comments on Prabhas dtr
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘ 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. వారి మ‌ధ్య స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ‌, ప‌ల్లెటూరిలోని రాజ‌కీయాలు, యువ‌త ప‌డే సంఘ‌ర్ష‌ణ అన్నింటినీ ఈ చిత్రంలో చూపించ‌బోతున్నాం. ఆగ‌స్ట్‌లో ఫ్రెండ్ షిప్ డే వారంలో  ఆగ‌స్ట్ 9న క‌మిటీ కుర్రోళ్ళు మూవీ రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అంద‌రితో క‌లిసి  చూసి ఎంజాయ్ చేసేలా, సెల‌బ్రేట్ చేసుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.

శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ ‘‘  మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ నిహారిక‌గారితో క‌లిసి క‌మిటీ కుర్రోళ్ళు సినిమా చేయ‌టం మంచి అనుభూతినిచ్చింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి రాజు ఎడురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రానికి వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు.

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios