పాయల్ రాజ్ పుత్ కు ఏమయ్యింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారా? కంటికి సబంధించిన సమస్యలు బాధిస్తున్నాయా? ఇంతకీ ఈ హీరోయిన్ పరిస్థితి ఏంటి? అభిమానులకు ఆమె ఇచ్చిన హెల్గ్ అప్ డేట్ ఎంటి?

టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం కంటి సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ నటి, తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఫోటో షేర్ చేస్తూ, తన కంటి సమస్య గురించి తెలియజేశారు.

"ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తోంది. అందుకే ఈ రోజు కళ్లద్దాలు పెట్టుకున్నాను. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, నా మాట నిలబెట్టుకొని ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చాను," అంటూ ఆమె తెలిపారు. తాను ఎదుర్కొంటున్న సమస్య డబుల్ విజన్ అనే అనుమానానికి తావిస్తోంది. అయితే ఆమె దీనిపై పూర్తి వైద్య వివరాలు వెల్లడించలేదు. దీంతో పాయల్ అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాయల్ రాజ్‌పుత్, 2018లో విడుదలైన 'ఆర్ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాయల్‌కు తెలుగు పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాతి సినిమాలు అంతగా విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పటివరకు తెలుగులో పాయల్ నటించిన 12 సినిమాల్లో కేవలం రెండు మాత్రమే విజయవంతమయ్యాయి.

అయినప్పటికీ, వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె వెనుకాడట్లేదు. ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ సినిమా పాయల్‌కు మరొక విజయాన్ని అందించింది. తెలుగు సినిమాల సరసన, పంజాబీ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించినా, ఇతర భాషల్లో మాత్రం ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

తాజాగా తలెత్తిన ఈ ఆరోగ్య సమస్య ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పాయల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపుతున్నారు.