పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ వచ్చింది. ఆయన `ఓజీ` సెట్‌లోకి అడుగుపెట్టారు. నేటి నుంచే ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నారట.   

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని పూర్తి చేశారు. త్వరలో ఇది రిలీజ్‌ కానుంది. ఇక ఇప్పుడు `ఓజీ` మూవీ షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే `ఓజీ` మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది.

ఫైనల్‌ షెడ్యూల్‌ని ప్రారంభిస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఇక ఇప్పుడు పవన్‌ ఎంట్రీ ఇచ్చారు. నేడు బుధవారం నుంచి పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. తాజాగా ఈ విషయాన్ని పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. 

`ఓజీ` సెట్‌లోకి అడుగుపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

`ఓజీ` మూవీ సెట్‌లోకి రియల్‌ ఓజీ ఎంట్రీ ఇచ్చారని ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించే విషయాన్ని పంచుకున్నారు. దీంతో పవన్‌ ఫ్యాన్స్ నిజంగానే ఊగిపోతున్నారు. తమకు కావాల్సింది ఇదే కాదా అని వాళ్లు సంబరపడుతున్నారు.

ఈ మూవీ షూటింగ్‌ని ఫాస్ట్ గా కంప్లీట్‌ చేయబోతున్నారట. పవన్‌ కళ్యాణ్‌ మీద సీన్లు తప్ప మిగిలిన సినిమా షూటింగ్‌ అంతా ఇప్పటికే పూర్తి చేశారు.  పవన్‌ డేట్స్ కోసమే ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తూ వచ్చారు. 

ఫైనల్‌ షెడ్యూల్‌లో `ఓజీ` మూవీ 

ఎట్టకేలకు పవన్‌ డేట్స్ ఇచ్చారు. ఏకంగా షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. ఓకే షెడ్యూల్‌లో సినిమా మొత్తాన్ని పూర్తి చేసే పనిలో టీమ్‌ ఉంది. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌తోపాటు ఇమ్రాన్‌ హష్మి, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.  

ముంబయి మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో పవన్‌ `ఓజీ..

ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఇందులో ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌గా పవన్‌ కనిపిస్తారని తెలుస్తుంది. పవన్‌ పాత్ర పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అభిమానులు పవన్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉంటుందని తెలుస్తుంది.

`యాక్షన్‌ మాత్రమే కాదు, సెంటిమెంట్‌ కూడా మెయిన్‌గా ఉండబోతుందట. అదే సినిమాకి బలం అని, దాని చుట్టే సినిమా తిరుగుతుందని, సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా సంచలనాలు క్రియేట్‌ చేయడం ఖాయమని గతంలో ఇందులో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి గతంలో తెలపడం విశేషం.

దీనికి తగ్గట్టే మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ అదిరిపోయే బీజీఎం రెడీ చేశారట. సినిమా కనెక్ట్ అయితే బాక్సాఫీసు షేక్‌ కావడం ఖాయమంటున్నారు. పవన్‌ ఫ్యాన్స్ కూడాఈ మూవీ కోసమే ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు ఆడియెన్స్ ముందుకు వస్తుందో చూడాలి.