పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అతి తక్కువ టైమ్ లో .. ఒక సినిమాలో తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసి..ఏ హీరో సాధించలేని రికార్డ్ ను సాధించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఎక్కడైనా స్టార్ హీరో అనేవారు ఒక సినిమా పూర్తి చేయాలి అంటే.. ఎంత టైమ్ పడుతుందో చెపపడం కష్టం. కొన్నినెలలు పట్టొచ్చు.. ఒక్కోసారి ఏడాదిపైనే పట్టొచ్చు.. మహేష్ లాంటివారు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తారు.. రాజమౌళి ఏహీరోతో సినిమా చేసినా.. రెండు మూడేళ్ళు పడుతుంది.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి.. టైమ్ ఉన్నప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించారు.
షూటింగ్ స్టార్ట్ అయిన నెల రోజుల్లోపే ఒక సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు పవర్ స్టార్. అది కూడా పొలికల్ ప్రెజర్ ఉన్న టైమ్... గతంలో తన ఒప్పుకున్న సినిమాలు చేతిలోనే ఉన్న టైమ్ లో.. బిజీ షెడ్యూల్ తో మాట కూడా మాట్లాడటానికి ఖాళీ లేనంత బిజీగా ఉన్న సమయంలో కూడా సినిమాని ఫినిష్ చేయడం పవర్ స్టార్ కు మాత్రమే సాధ్యం అయ్యింది.
పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా దాదాపు చివరిదశలో ఉంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలంగా నాన్చుతూ వస్తున్నాడు పవర్ స్టార్. ఏప్రిల్ లో ఈసినిమా కోసం 10 రోజులు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేయాల్సి ఉంది పవర్ స్టార్. ఇటు వీనోదయ సీతం షూటింగ్ ఆల్ రెడీ పూర్తి చేశాడు పవర్ స్టార్.
నటుడు దర్శకుడు తమిళ ఇండస్ట్రీకి చెందిన సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వినోదయ సితం తెలుగు రీమేక్ వెర్షన్ లోని తన భాగాన్ని పూర్తి చేశారు. సాయిధరమ్ తేజ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ..పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కేవలం 24 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు పవన్. ఈ మధ్యకాలంలో ఇంత షార్ట్ టైంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమాను పూర్తి చేయలేదు. ఇక నెక్ట్స్ పెండ్డింగ్ లో ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాడు పవర్ స్టార్. నెక్ట్స్ ఇయర్ ఎలక్షన్స్ ఉండటంతో.. ఈ ఏడాది మిడ్ లోపు సినిమాలన్నీ కంప్లీట్ చేసి.. ఇక రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్.