పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తొలిసారి రాబోతున్న చిత్రం బ్రో ది అవతార్. ఫ్యాన్స్, ప్రేక్షకులు బ్రో చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి తొలిసారి చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు బ్రో చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తున్నారు. 

తమిళంలో వినోదయ సీతం చిత్రాన్ని సముద్రఖని నటించి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అనేక మార్పులతో రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని మార్చారు. పవన్ ఫాన్స్ అలీ అలరించే అంశాలు ఉంటూనే ఎమోషన్స్ ప్రధానాంగా హైలైట్ అయ్యేలా ఈ చిత్రం ఉందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఈ చిత్రానికి ఓటిటి ఫ్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ బ్రో చిత్రాన్ని భారీ ధర వెచ్చించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు వారాల తర్వాత బ్రో మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుందంటూ వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం లేదు కానీ.. జరుగుతున్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న బ్రో చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. 

ఏది ఏమైనా ఐదు వారాల తర్వాత బ్రో మూవీ ఓటిటి లోకి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారట. ప్రస్తుతం అయితే థియేటర్స్ లో హంగామా సాగుతోంది. మరణించిన వ్యక్తికి కాల దేవుడు ప్రత్యక్షమై మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్, డైలాగ్స్, సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ హైలైట్ అయినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.