షంషేరా మూవీ రిలీజ్ ను తన సినిమా కోసం వాడుకోబోతున్న షారుఖ్ ఖాన్, పఠాన్ ప్లాన్ అదిరిందిగా
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మాస్టర్ ప్లాన్ అదిరింది. తన పఠాన్ మూవీ ప్రమోషన్ కోసం.. రణ భీర్ కపూర్ షంషేరా స్క్రీనింగ్ ను వాడుకోబోతున్నాడు. అది ఎలాగంటే..?
ఈసారి సాలిడ్ గా సాధించాలి అని పట్టుదలతో ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఈ బాలీవుడ్ స్టార్ హీరో నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన జీరో డిజాస్టర్ అయిన తరువాత ఇప్పటి వరకు షారుఖ్ నుంచి మరో సినిమా రాలేదు. షారుఖ్ ఖాన్ సినిమా కోసం ప్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెండి తెరపై తమ అభిమాన నటుడిని చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక నాలుగేళ్ళ గ్యాప్ను పూర్తి చేసేందుకు షారుఖ్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. కరోనా వల్ల గ్యాప్ రావడంతో ఈసినిమాలు బాగా డిలై అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం షారుఖ్ నటించిన పఠాన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఆడియ్స్ ముందుకు రాబోతోంది. ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో పఠాన్ మూవీ ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటినుండే అప్డేట్లను స్టార్ట్ చేశారు. కాగా ఈ సినిమా టీజర్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. షారుఖ్ తన సినిమా ప్రమోషన్ కోసం రణ్ భీర్ కపూర్ సినిమా షంషేరా ను కూడా ఉపయోగించుకోబోతున్నాడు.
పఠాన్ సినిమా టీజర్ను రణ్ బీర్ షంషేరా సినిమాకి జత చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన షంషేరా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో పఠాన్ టీమ్.. ఈమూవీ టీజర్ను షంషేరా థియేటర్లలో ప్లే చేయాలని భావిస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలకపాత్రల్లో నటించారు.
ఇక ఇదివరకే పఠాన్ నుండి రిలీజ్ అయిన షారుఖ్ 8ప్యాక్ ఫోటో, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. మరి పఠాన్ సినిమాతో షారుఖ్ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.