ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకి ఇటీవల ముంబైలో గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ 'నాన్నగారికి ఆపరేషన్ జరిగింది. 

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకి ఇటీవల ముంబైలో గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ 'నాన్నగారికి ఆపరేషన్ జరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం కోలుకుంటున్నారు' అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. బ్రహ్మానందం ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. బ్రహ్మానందం గ్యాస్ సమస్యతో హాస్పిటల్ కి వెళ్తే అక్కడ వైద్యులు పరీక్షించి ఓ సర్జరీ అవసరమవుతుందని చెప్పినట్లు పరుచూరి తెలిపారు.

సర్జరీ పూర్తయిన తరువాత నాలుగైదు వారాలు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఆపరేషన్ ముంబైలో చేయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో అయితే పరామర్శలు ఎక్కువ ఉంటాయనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆపరేషన్ బాగానే అయిందని, బ్రహ్మానందం కోలుకుంటున్నట్లు, త్వరలోనే హైదరాబాద్ వస్తారని తెలిపారు. 

బ్రహ్మానందం ఆరోగ్యంపై కొడుకు క్లారిటీ!

హాస్య నటుడు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ