బిగ్‌ బాస్‌ తెలుగు 7 హౌజ్‌లో `పంచె` గొడవ గట్టిగానే సాగింది. నామినేషన్ల ప్రక్రియలో గౌతమ్‌, పల్లవి ప్రశాంత్‌ మధ్య ఈ పంచె వాదన ప్రారంభమైంది. అది కాస్త సీరియస్‌ గా వెళ్లింది.  

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌజ్‌లో పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ లేదు. వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందని ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 12వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరిగింది. 

ఇందులో అమర్‌ దీప్‌.. యావర్‌, రతికలను నామినేట్‌ చేశాడు. గౌతమ్‌.. ప్రశాంత్‌, శివాజీలను నామినేట్‌ చేశాడు. రతిక.. అమర్‌ దీప్‌, ప్రశాంత్‌లను నామినేట్‌ చేసింది. అర్జున్‌.. యావర్‌, శివాజీలను నామినేట్ చేశాడు. ప్రశాంత్‌.. గౌతమ్‌, రతికలను నామినేట్‌ చేశారు. ఇందులో అశ్విని వంతు రాగా, సిల్లీ రీజన్స్ తో ఎవరినీ నామినేట్‌ చేయనని, తన సెల్ఫ్‌ నామినేషన్‌ తీసుకుంది. అయితే ఆమెని అప్పటి వరకు ఎవరూ నామినేట్‌ చేయలేదు. ఓ రకంగా సేఫ్‌లోనే ఉంది. కానీ ఆమె తనని తాను నామినేట్‌ చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అది ఆమె తెలివి తక్కువ పనికి నిదర్శనంగా చెప్పొచ్చు. 

ఇక నామినేషన్లలో రతిక, పల్లవి ప్రశాంత్‌ మధ్య ఆసక్తికరమైన గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్‌ సినిమా రేంజ్‌ డైలాగులతో రచ్చ చేశాడు. మరోవైపు రతిక, అమర్‌ దీప్‌ ల మధ్య కూడా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగింది. రతిక డామినేటింగ్‌ ప్రశ్నలకు, అమర్‌ దీప్‌ రియాక్షన్‌ అదిరిపోయింది. నేను మారను ఇలానే ఉంటానని తెగేసి చెప్పాడు. అలాగే పల్లవి ప్రశాంత్‌ కూడా తాను మారనని స్పష్టం చేశారు. 

మరోవైపు పంచె గొడవ గట్టిగానేసాగింది. గౌతమ్‌ని ప్రశాంత్‌ నామినేట్‌ చేశాడు. ఇద్దరి మధ్య కన్వర్జేషన్‌ జరుగుతుంది. ఇందులో గౌతమ్‌ పంచె ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ఆ పంచె ఊడకుండా చూసుకో అని అన్నాడు. దానికి గౌతమ్‌ రచ్చ చేశాడు.పంచె తెలుగోడి సంస్కృతి, అది నాకు ఇష్టం అంటూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టిగా వాదనలు జరిగాయి. కాసేపు పీక్‌కి వెళ్లాయి. గౌతమ్‌ ఆవేశంతో ఊగిపోయాడు. మరోవైపు ప్రశాంత్‌ టాబ్లెట్లు వేసుకో అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడంతో అది మరింత పెరిగింది. 

ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం మేరకు పల్లవి ప్రశాంత్‌, శివాజీ, రతిక, గౌతమ్‌, అమర్‌ దీప్‌, యావర్‌, అశ్విని నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. వీరితోపాటు అర్జున్‌ కూడా నామినేషన్‌లో ఉన్నారని టాక్‌.  ఎనిమిది మంది ఈ వారం నామినేషన్‌లో ఉన్నట్టు టాక్‌. ఇదిలా ఉంటే గత వారం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని యావర్‌ తిరిగి ఇచ్చేసిన విషయం తెలిసిందే. మళ్లీ దానికి జరిగిన టాస్క్ లో ప్రశాంత్‌ విన్నర్‌ అయినట్టు సమాచారం. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని ఆయన సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆయన ముందుగానే నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారని చెప్పొచ్చు.