శివాత్మికతో పంచతంత్రం చేస్తున్న బ్యానర్ నుంచి.. ఈ ఏడాది సినిమాల జాతర
బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ లీడ్ రోల్స్ లో.. యస్ ఓరిజినల్స్ బ్యానర్ లో పంచతంత్రం మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని తెరకెక్కిస్తున్న బ్యానర్ లోఈ ఏడాది మరో 9 సినిమాలు రూపోందుతునాయి.
బ్రహ్మానందం గారు , కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న పంచతంత్రం, యూత్ లో స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సంతోష్ శోభన్ హీరోగా, ఎమ్ ఆర్ ప్రొడక్షన్ తో డిజిటల్ మీడియా లో బ్రాండ్ గా ఎదిగిన సుభాష్ దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథతో సినిమాను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనులలో ఉంది. ఈ బ్యానర్ నుంచి మరికొన్ని సినిమాలు ఈ ఏడాది సందడి చేయబోతున్నాయి.
కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తనదైన ముద్రను సొంతం చేసుకున్న యస్ ఓరిజినల్స్ ఈ సంవత్సరంలో లో మరింత వేగం చూపించబోతుంది. ఈ ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాలు యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నాయి. కాన్సెప్ట్ ని నమ్మి కొత్త తరం దర్శకులను పరిచయం చేస్తూ టాలీవుడ్ లో తన ముద్రను మరింత బలంగా వేయబోతుంది. ఇప్పటికే యస్ ఓరిజినల్స్ అంటే కొత్త తరం కథలకు కేరాఫ్ అడ్రస్ అనే మాట టాలీవుడ్ అంతటా వినపడుతుంది
యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండే ఈ యేడాది 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ అన్ని దాదాపుగా ముగింపు దశలో ఉన్నాయి. అంతే కాదు ఈ బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమాల ద్వారా కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇవే కాకుండా మరికొన్ని కథలను ఫైనలైజ్ చేస్తున్నారు టీమ్. బ్రహ్మానందం పంచతంత్రం ఇప్పటికే రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఒక కొత్త కాన్సెప్ట్ తో సుమంత్ హీరోగా రూపొందుతన్న అహాం సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతుంది.
ఇక స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా.. మరో కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో చెరుకూరి సుబ్బు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినామ షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇక మరో కొత్త దర్శకుడు బ్రిజేష్ దర్శకత్వంలో వైరల్ సినిమా ఎస్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. గతం సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన కిరణ్ దర్శకత్వంలో అదే టీంతో మరో సినిమా రూపొందిస్తున్నారు ఎస్ ఒరిజినల్స్ టీమ్. ఇక ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
వీటితో పాటు కన్నడంలో బీర్బల్ ట్రియాలజీ తీసిన దర్శకుడు శ్రీని దర్శకత్వంలో ఓల్డ్ మంక్ అనే సినిమాని... కొత్త దర్శకుడు విష్ణు దర్శత్వంలో మళయాళంలో రూపొందుతున్న నైనా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లో 96 మూవీ ఫేమ్ గౌరి కిషన్ లీడ్ రోల్ చేస్తుంది.ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ , గరీమ దర్శకత్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ లలో ఉంది.
Also Read : Radhe Shyam: రాధే శ్యామ్ సంక్రాంతి కి వస్తుందా?... ప్రస్తుత పరిస్థితి ఇది!