Asianet News TeluguAsianet News Telugu

సురేఖ వాణి, జబర్దస్త్ రోహిణి, శ్రద్దా దాస్, సునీల్ రచ్చ లేపారుగా.. పారిజాత పర్వం ట్రైలర్

హీరో చైతన్య రావు తన స్థాయిలో మంచి చిత్రాలు చేస్తూ గుర్తింపు పొందుతున్నాడు. చైతన్య రావు నటించిన తాజా చిత్రం పారిజాత పర్వం. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న రిలీజ్ అవుతోంది.

Paarijatha Parvam trailer out now dtr
Author
First Published Apr 10, 2024, 7:51 PM IST

హీరో చైతన్య రావు తన స్థాయిలో మంచి చిత్రాలు చేస్తూ గుర్తింపు పొందుతున్నాడు. చైతన్య రావు నటించిన తాజా చిత్రం పారిజాత పర్వం. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న రిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మంచి క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ అల్లుకున్న కథలా అనిపిస్తోంది. 

ఈ చిత్రంలో చైతన్య రావుతో పాటు శ్రద్దా దాస్, సురేఖ వాణి, సునీల్, జబర్దస్త్ రోహిణి, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ వీరి పాత్రలన్నీ నవ్వులు పూయించేలా ఉన్నాయి. చిన్న చిన్న ఫన్నీ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

కిడ్నాప్ డ్రామాలో దర్శకుడు బాగా ఫన్ జనరేట్ చేశాడు. సునీల్, జబర్దస్త్ రోహిణి ఫన్నీ డైలాగులు చాలా బావున్నాయి. వైవా హర్ష రచ్చ మామూలుగా లేదు. ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అసలు ఎవరు కిడ్నాప్ అయ్యారు.. ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. 

శ్రద్దా దాస్ అమాయకంగా కనిపిస్తోంది. సురేఖ వాణికి కూడా మంచి రోల్ దొరికినట్లు తెలుస్తోంది. మరి ఎవరు తమ పెర్ఫామెన్స్ తో డామినేట్ చేశారో చూడాలి. సునీల్ కిడ్నాప్ ప్లాన్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చివర్లో వైవా హర్ష.. బ్రో లక్ష్మణ్ ని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios