సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది చిత్రబృందం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే నాలుగు పాటలు విడుదల చేసిన యూనిట్ తాజాగా ఐదో పాటను కూడా వదిలింది. 'పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే..' అంటూ సాగే ఈ పాట మహేష్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వీడియోలో మహేష్, పూజ వేసుకున్న కాస్ట్యూమ్స్, స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

పాటను చాలా కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.