Asianet News TeluguAsianet News Telugu

రాజుగారి గది3 ట్రైలర్: హర్రర్ డోస్ పెరిగింది.. ఒళ్ళు గగుర్పొడిచేలా!

యాంకర్ గా బుల్లి తెరపై రాణించిన ఓంకార్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం జీనియస్. ఈ చిత్రానికి దర్శకుడిగా ఓంకార్ కు ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత హర్రర్ నేపథ్యంలో రాజుగారి గది చిత్రాన్ని తెరకెక్కించాడు. 

Omkar's Rajugari gadhi 3 trailer released
Author
Hyderabad, First Published Sep 15, 2019, 1:01 PM IST

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది చిత్రం 2015లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా రాజుగారి గది2ని 2017లో ఓంకార్ తెరకెక్కించాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓంకార్ రాజుగారి గది 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 

సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసేశాడు. ఓంకార్ సోదరుడు అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఓంకార్ ఈ చిత్రంలో మరింతగా హర్రర్ అంశాల డోస్ పెంచేశాడు. ట్రైలర్ లో కొన్ని మూమెంట్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. 

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రాజుగారి గది 3 ట్రైలర్ విడుదలైంది. 'ఇదే యక్షిని పాతేసిన చోటు' అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రం కోసం వేసిన సెట్స్, అవికా గోర్ గెటప్ భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. 

ఈ కన్యని తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం అంటూ అశ్విన్ చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios