బ్యాక్ గ్రైండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. త్వారలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో రాబోతున్నాడు.  

ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ యంగ్ స్టార్ హీరోగా కశ్మీర పర్ధేశీ కిరణ్ జంటగా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. 

ఇది వరకే ఈ సినిమా నుండి రిలీజైన వాసవసుహాస పాటకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత కాదు ఇది వరకే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా ఈ టీజర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై కూడా ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా ఈ చిత్రం సెకెండ్ సింగిల్ ప్రోమో విడుదల చేసింది చిత్రబృందం.ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నారు.

YouTube video player

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ".