Asianet News TeluguAsianet News Telugu

‘మహానటి’లో ఎన్టీఆర్ పాత్ర ఉండాల్సింది.. తారక్ ను అందుకే తీసుకోలేదు.. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కామెంట్స్..

సూపర్ హిట్ ఫిల్మ్ బయోగ్రాఫికల్ డ్రామా ‘మహానటి’ ప్రముఖ నిర్మాత అశ్విని దత్ స్థాపించిన వైజయంతి ‘మూవీస్ బ్యానర్’లో వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పాత్ర కోసం తారక్ ను ఎందుకు తీసుకోలేదో..  తాజాగా అశ్వినీ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

NTR was supposed to be in Mahanati, Producer Ashwini Dutt Intresting comments
Author
Hyderabad, First Published Aug 17, 2022, 7:38 PM IST

నట గాయత్రి, దివంగత సినీయర్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’ (Mahanati). 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించింది. జెమిని గణేసన్ పాత్రలో మలయాళ నటుడు దుల్కర్ సల్మార్ అద్భుతంగా నటించారు. అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో నాగచైతన్య, మధురవాణి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్  పాత్రలో ఎవరూ నటించలేదు. 

ఇదే విషయాన్ని ఇటీవల  ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ (Ashwini Dutt) వెల్లడించారు. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (NTR)ను ఎందుకు తీసుకోలేదో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..  ‘మహానటి చిత్రంలోని సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ నటించాల్సి ఉంది. అలాగే చేయిద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే  నందమూరి బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్’ను ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ను పెడితే బాగుండదేమోనని భావించాం. ఇదే విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ తో చెబితే ‘ఎన్టీఆర్ పాత్ర లేకుండా చిత్రీకరిస్తాం’ అని చెప్పారు. దాంతో చిత్రంలో ఆర్చీవ్ ఫుటేజీ షాట్ తోనే సరిపెట్టారు. ఎక్కువ శాతం నాగేశ్వర్ రావు పాత్రకు సంబంధించిన సీన్లను నాగచైతన్యతో చిత్రీకరించామ’ని తెలియజేశారు. లేదంటే ఎన్టీఆర్ తప్పకుండా ‘మహానటి’లో ఉండేవారనని చెప్పుకొచ్చారు. 

బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం భారీ చిత్రాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ‘సీతా రామం’ ప్రేక్షకులను మెప్పించింది. అటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ కే’ను చిత్రీకరిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా నాగ్ అశ్వినే దర్శకుడు. రూ.500 కోట్లతో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ అశ్విని దత్. చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios