యాక్షన్ సీన్ తో మొదలుపెడతారట
జైలవకుశ వచ్చి ఆరు నెలలు దాటింది. ఫ్యాన్స్ తారక్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తారక్ త్రవిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం నుంచి సెట్స్పైకి వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు . ఈ చిత్రం కోసం యంగ్ టైగర్ 20 కిలోల బరువు తగ్గిన విషయం తెలిసిందే. హాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్.. హీరోకి జిమ్లో హార్డ్గా ట్రైనింగ్ ఇచ్చాడు. హైదరాబాద్ శివార్లలో వారం రోజులపాటు యాక్షన్ సీన్స్ చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్.
ఈ సీన్స్లో ఎన్టీఆర్ సిక్స్ప్యాక్తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. భరత్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ని వచ్చిన ఎన్టీఆర్, స్లిమ్గా, స్టైలిష్గా కనిపించాడు. ఫైనల్ మేకోవర్లో ఏ విధంగా వుంటాడనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. అజ్ఞాతవాసి డిజాస్టర్తో ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ హిట్ కొట్టాలనే ఆలోచనతో వున్నాడు. స్టోరీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు చాలా సమయాన్ని కేటాయించాడు ఆయన. ఇందులో ఎన్టీఆర్తో పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది.